విశాఖ డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించాలన్న హైకోర్టు నిర్ణయపై స్పందించారు టీడీపీ జాతీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు పిచ్చివాడు అనే ముద్ర వేయాలనున్నాడు ఓ ఉన్మాది అంటూ ట్వీట్ చేశారు. సుధీర్ఘకాలం డాక్టర్ అయిన సుధాకర్.. ప్రజలకు చేసిన సేవే ఆయనకు శ్రీరామ రక్ష అయిందన్నారు. మాస్క్ అడిగినందుకు ఓ దళిత డాక్టర్ ఎదుర్కొన్న అవమానాలు, బెదిరింపులు, వేధింపులు అన్నీ సీబీఐ ఎంక్వైరీలో బయపడతాయన్నారు.