కరోనావైరస్ వ్యాప్తి గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసిందే.. చైనాలో ఉద్భవించిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం 180కి పైగా దేశాల్లో వ్యాపించింది. 193 దేశాలను యుఎన్ అధికారికంగా గుర్తించింది. పాజిటివ్ కేసులు 5,606,999 కు పెరిగాయి.. అయితే ఇందులో కోలుకున్నవారి సంఖ్య మాత్రం 2,383,989 మంది ఉన్నారు. అలాగే 348,253 కోవిడ్ భారిన పడి మరణించారు. అయితే పన్నెండు దేశాలలో మాత్రం కరోనా లేదని నివేదికలు పేర్కొంటున్నాయి. వాటిలో కిమ్ జుంగ్ ఉన్ ఆధ్వరంలోని ఉత్తరకొరియా కూడా ఉంది. కరోనాకేసులు నివేదించని దేశాల జాభితా ఇలా ఉంది. వీటిలో కొన్నిదీవులు కూడా ఉండటం విశేషం.
*ఉత్తర కొరియా
*తుర్క్మెనిస్తాన్
*సోలమన్ దీవులు
*వనాటు
*సమోవా
*కిరిబాటి
*ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా
*టోంగా
*మార్షల్ దీవులు
*పలావు
*తువలు
*నౌరు