ప్రభుత్వ మానసిక వైద్యశాలలో డాక్టర్ సుధాకర్కు అందిస్తున్న వైద్యంపై ఆయన తల్లి కావేరిబాయి అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదే అంశంపై హైకోర్టు న్యాయమూర్తికి కావేరిబాయి లేఖ రాశారు. సీబీఐ విచారణ సమయానికి తన బిడ్డను పిచ్చివాడిగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సీసీ కెమెరాల మధ్య నిపుణులైన ప్రైవేటు వైద్యులతో కోర్టు పర్యవేక్షణలో చికిత్స జరిపించాలని విజ్ఞప్తి చేశారు.