శ్రీవారి భూమిలో గజం కూడా అమ్మినా ఊరుకునేది లేదు: కన్నా

Update: 2020-05-26 20:19 GMT

తిరుమల శ్రీవారి భూములను ఇప్పుడే కాదు..భవిష్యత్తులోనూ అమ్మకూడదని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర ఆధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. శ్రీవారి స్థిరాస్థిలో గజం భూమి అమ్మిన ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. స్వామివారి ఆస్తులను అమ్మాలన్న టీటీడీ నిర్ణయానికి వ్యతిరేకంగా దీక్ష చేపట్టిన కన్నా..సింహాచలంలో దేవాలయ భూములను ఆక్రమణపై మండిపడ్డారు. సింహాచల ఆలయ భూములను ఎవరి పరం అయ్యాయో లెక్కతేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారాయన.

Similar News