ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభన కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 98 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3042కి చేరింది. ఈ రోజు కరోనాతో ఇద్దరు మృతి చెందగా.. మృతుల సంఖ్య 62 కు చేరింది. ఇప్పటివరకూ 2135 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా 845 మంది ఆస్పత్రికలో చికిత్స పొందుతున్నారు.