నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో హైకోర్టు తీర్పును ఏజీ అడ్డుకోవడం మంచిది కాదన్నారు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్. ఏజీ వాదనలో పస లేదన్నారాయన. ఆర్డినెన్స్ చెల్లదు అని హైకోర్టు చెప్పాక.. తీర్పు సరిగా లేదని ఏజీ చెప్పడం కరెక్ట్ కాదన్నారు. ప్రభుత్వం కావాలంటే సుప్రీం కోర్టుకు వెళ్లాలి కానీ.. ఏజీ మీడియా సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారని కనకమేడల ప్రశ్నిస్తున్నారు.