జీహెచ్ఎంసీ కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. నాలుగో ఫ్లోర్లోని ఓ సెక్షన్లో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఫోర్త్ ఫ్లోర్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఇళ్లకు పంపించి.. ఆఫీస్ మొత్తం శానిటైజ్ చేస్తున్నారు. బల్దియా కార్యాలయంలో మొత్తం 1500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీంతో ఉద్యోగులంతా ఆందోళన చెందుతున్నారు.