ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఒకేసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విడుదల చేశారు మంత్రి సురేష్. మార్చి 19న వాల్యుయేషన్ పూర్తయిందని, కాలేజీలు ర్యాంకులు ప్రచారం చేయకూడదని బోర్డు తెలిపింది. ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన తొలిరాష్ట్రంగా ఏపీ రికార్డులకెక్కింది. జూన్ 15 నుంచి ఇంటర్ విద్యార్థులకు మార్కుల మెమోలు అందిస్తామని మంత్రి తెలిపారు.