కరోనా నుంచి ప్రపంచాన్ని కాపాడాలని శ్రీవారిని కోరుకున్నానని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు దేవుడు చూస్తున్నాడని.. తప్పుచేసిన వారికి త్వరలోనే బుద్ధి చెబుతారని అన్నారు. చరిత్ర చాలామందికి సమాధానం చెప్పిందని.. తాజా పరిణామాలకు కూడా సమాధానం దొరుకుతుందని తెలిపారు. ఇద్దరు నేతలు ఆదివారం శ్రీవారిని దర్శించకున్నారు. చాలారోజుల తర్వాత తిరుమలకు రావడం సంతోషంగా వుందన్నారు.