బెజవాడ గ్యాంగ్ వార్ ఘటనపై పోలీసుల కఠిన నిర్ణయం తీసుకున్నారు. పండు, సందీప్ గ్యాంగ్లకు చెందిన సభ్యులను నగరం నుంచి బహిష్కరించారు. గ్యాంగ్వార్లో పాల్గొన్న అందరూ.. విజయవాడ విడిచి వెళ్లాలని డీసీపీ హర్షవర్ధన్ ఆదేశించారు. అటు.. ఇప్పటికే రెండు గ్యాంగ్లకు చెందిన 37 మంది అరెస్టు చేశారు. మరో 13 మంది పరారీలో ఉన్నారు.