సీఎం జగన్ ఎంతగా టార్గెట్ చేసినా తాను బెదిరేది లేదన్నారు మాజీ ఎంపీ, TDP నేత JC దివాకర్రెడ్డి. కక్షతోనే తన బస్సులు, లారీలు ఆపేశారని చెప్పుకొచ్చారు. ఇలాంటి వాటికి తాను భయపడబోనని, వ్యవసాయం చేసుకునైనా తాను బతకగలనని అన్నారు. కడప జిల్లా కమలాపురం వెళ్లిన JC.. అక్కడ TDP నేత పుత్తా నరసింహారెడ్డిని కలిసారు. ప్రభుత్వ డబ్బుతో ఓట్లు కొనాలని జగన్ చూస్తున్నారని మండిపడ్డారు.