వీరమరణం పొందిన సంతోష్ పేరు ఏదైనా ప్రాజెక్ట్కు పెట్టాలి: ఉత్తమ్ కుమార్రెడ్డి
భారత్ - చైనా సరిహద్దుల్లో జరిగిన గొడవలో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్బాబు కుటుంబాన్ని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి పరామర్శించారు. సంతోష్ వీరమరణం పొందడం బాధగా ఉన్నా.. దేశం కోసం చనిపోవడం గర్వంగా ఉందన్నారు. తెలంగాణకు గొప్ప పేరు తెచ్చిన సంతోష్ పేరు చిరస్మరణీయంగా నిలిచేలా ఏదైనా ప్రాజెక్టుకు ఆయన పెరుపెట్టాలని సీఎం కేసీఆర్ను కోరారు. సోనియాగాంధీ పంపిన సంతాప సందేశాన్ని చదివి వినిపించారు ఉత్తమ్ కుమార్రెడ్డి.