ఏపీ : 24 గంటల్లో కరోనాతో 8 మంది మృతి

Update: 2020-06-24 08:21 GMT

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 9 వేల 834కు చేరాయి. కొత్తగా 462 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీకి చెందిన 407 మందికి... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 40 మందికి... విదేశాల నుంచి వచ్చిన వారిలో 15 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 8 మంది మృతి చెందారు. కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ముగ్గురు.. కడప, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృత్యువాత పడ్డారు. గత 24 గంటల్లో 20 వేల 639 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అటు.. 5 వేల 123 యాక్టివ్ కేసులు ఉండగా.. 4 వేల 892 మందిని డిశ్చార్జ్ చేశారు.

Similar News