ఓవైపు కరోనా వేగం పెంచుతుంటే.. అంతకు మించిన వేగంతో గుజరాత్ లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఇటీవల కాలంలో కాంగ్రెస్ కు, అసెంబ్లీ అబ్యర్థిత్వానికి రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు.. తాజాగా బీజేపీ గూటికి చేరారు. మార్చి నుంచి జూన్ వరకూ మొత్తం ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి.. బీజేపీలో చేరడంతో త్వరలో రానున్న రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది.