చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్నహస్తం పథకంలో అనేక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. అస్సలైన లబ్ధిదారులకు కాకుండా వైసీపీ కార్యకర్తలకు డబ్బులు కట్టబెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లాలోని పలు చోట్ల నేత కార్మికులకు బదులుగా వైసీపీ కార్యకర్తల అకౌంట్లలో డబ్బులు వేశారని కార్మికులు ఆరోపిస్తున్నారు.
గత మూడు నెలలుగా వారుపు రాకపోవడంతో తమకు పనులు లేకుండా పోయాయని.. ప్రభుత్వం తమను పట్టించుకోకుండా వైసీపీ కార్యకర్తలకు డబ్బులు ఇచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 'వైఎస్సార్ నేతన్న నేస్తం' పథకం కింద మగ్గం ఉన్న ప్రతీ నేతన్న ఖాతాలో రూ.24వేలు జమ చేస్తామన్న సీఎం జగన్ మాటలు ఒట్టిమాటలుగానే మిగిలాయంటున్నారు.