ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు జూనియర్ సివిల్కోర్టు జడ్జీలను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 151 మంది జూనియర్ సివిల్ జడ్జీలకు హైకోర్టు బదిలీలు, పోస్టింగ్లు కల్పించింది. ఈ మేరకు బుధవారం హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా ఈ నెల 15 లోపు రిలీవ్ కావాలని ఆదేశించారు. అలాగే 22 లోపు నూతన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వులు జారీ చేశారు.