ఏపీలో ఆందోళనకరంగా పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా..

Update: 2020-07-12 17:13 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 17,624 శాంపిల్స్ ‌ ని పరీక్షించగా 1,914 మందికి కోవిడ్‌19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. అలాగే 846 మంది కోవిడ్‌ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్ట్‌ అయ్యారు. కోవిడ్‌ వల్ల కర్నూల్‌ లో నలుగురు, శ్రీకాకుళం లో నలుగురు, కృష్ణ లో ముగ్గురు, విశాఖపట్నం లో ముగ్గురు చిత్తూర్‌ లో ఇద్దరు, నెల్లూరు లో ఒక్కరు, అనంతపురంలో ఒక్కరు, పశ్చిమ గోదావరి లో మరొకరు మరణించారు.

ఆదివారం వరకు రాష్ట్రంలో 11,53,849 సాంపిల్స్‌ ని పరీక్షించడం జరిగింది. రాష్ట్రంలో 11,071 మంది ఆసుపత్రులలో , 2,357 మంది కోవిడ్‌ కేర్‌ సెంటర్స్‌ లో వెరసి మొత్తం 13,428 మంది చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రం లోని నమోదైన మొత్తం 26,336 పాజిటివ్ కేసులకు గాను 13,245 మంది డిశ్చార్జ్ కాగా 328 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 12,763 గా ఉంది.

Similar News