తెలంగాణలో ఒక్కరోజే 1269 కరోనా పాజిటివ్‌ కేసులు

Update: 2020-07-20 08:26 GMT

తెలంగాణలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంంలో కొత్తగా 1269 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 557 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 45076 పాజిట‌టివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఒక్కరోజే ఆరుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 415కు చేరింది. కరోనా మహమ్మారి బారి నుండి కోలుకుని మొత్తం 32,438 మంది డిశ్చార్జి అయ్యారు.

Similar News