తెలంగాణలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలిని సూచించారు.