ఏపీలో కొత్తగా 289 కరోనా కేసులు!

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 51,207 కరోనా టెస్టులు చేయగా, 289 కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది

Update: 2021-01-06 14:51 GMT

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 51,207 కరోనా టెస్టులు చేయగా, 289 కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,83,876కి చేరింది. అయితే ఇందులో 2,896 యాక్టివ్‌ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 352 మంది కరోనా నుంచి కోలుకోగా.. కోలుకున్న వారి సంఖ్య 8,73,855 కి చేరింది. ఇక కరోనా బారిన పడి రాష్ట్రంలో ఇప్పటివరకు 7,125మంది మృతి చెందారు. అటు రాష్ట్రంలో ఇప్పటివరకు 1,21,05,121 కరోనా పరీక్షలు నిర్వహించారు.


Tags:    

Similar News