తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కిడ్నాప్ కలకలం రేపింది.. ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల బాలికను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. దుర్గమ్మగుడి వీధికి చెందిన ఐదేళ్ల చిన్నారి రోహిణిని లేస్ ప్యాకెట్ ఇప్పిస్తానని ఓ దుండగుడు ఎత్తుకెళ్లినట్లుగా స్థానికులు చెబుతున్నారు. లేస్ ప్యాకెట్ ఇప్పించి యాక్టివా స్కూటర్పై ఎత్తుకెళ్లినట్లుగా చెబుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించిన తల్లిదండ్రులు.. బాలిక ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిసరాల్లోని సీసీ కెమెరాల విజువల్స్ను పరిశీలిస్తున్నారు.