ఏపీలో కొత్తగా 6,096 కరోనా కేసులు.. 20 మరణాలు

ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. కొత్తగా 6,096 కరోనా కేసులు.. 20 మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో ఐదుగురు మృతి చెందారు.

Update: 2021-04-16 14:15 GMT

ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. కొత్తగా 6,096 కరోనా కేసులు.. 20 మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో ఐదుగురు మృతి చెందగా.. కృష్ణా జిల్లాలో ముగ్గురు.. అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, విశాఖలో ఇద్దరు చొప్పున కరోనాతో మృతి చెందారు. ఇక చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1024, తూర్పు గోదావరిలో 750, గుంటూరులో 735, కర్నూలులో 550, శ్రీకాకుళం 534, విశాఖ 454, కృష్ణాలో 318 కేసులు వచ్చాయి. తాజా కేసులతో కలిపి ఏపీలో మొత్తం 9లక్షల48వేల231కి కరోనా కేసులు చేరాయి. మొత్తం మరణాల సంఖ్య 7,343కి చేరింది. ప్రస్తుతం 35వేల 592 యాక్టివ్ కేసులు ఉండగా.. 9లక్షల5వేల266 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Tags:    

Similar News