అదానీ అవినీతి వ్యవహారంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపణలు ఏపీలో సంచలనం రేపుతున్నాయి. ఏపీ మాజీ సీఎం జగన్ కు పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ 1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో స్పష్టంగా వెల్లడైందని షర్మిల అన్నారు. ఈ అవినీతి కేసుతో అదానీ దేశం పరువు, జగన్ రాష్ట్రం పరువు తీశారని ఆరోపించారు.