అఖిలప్రియకి ఊరట!

బోయిన్ పల్లికిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియకి ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకి సికింద్రాబాద్ కోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Update: 2021-01-22 13:09 GMT

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియకి ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకి సికింద్రాబాద్ కోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.. రూ. 10 వేల పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీ సమర్పించాలని ఆదేశించింది. కిడ్నాప్ కేసులో అరెస్టయిన అఖిలప్రియ ప్రస్తుతం పోలీసుల రిమాండ్ లో ఉంది. దీంతో రేపు అఖిలప్రియ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. అటు ఇదే కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న ఆమె భర్త భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.    

Tags:    

Similar News