BOTSA: బొత్స త్వరగా కోలుకోవాలి: నారా లోకేశ్

సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలన్న పవన్

Update: 2026-02-28 05:45 GMT

వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం అస్వస్థతకు గురై చికిత్స చేయించుకున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని నారా లోకేశ్ ఆకాంక్షించారు. తన సహచర ఎమ్మెల్సీ బొత్స త్వరగా ప్రజాసేవలోకి రావాలని ప్రార్థిస్తున్నట్లు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ట్వీట్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న బొత్స ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ స్పందిస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.

"శా­స­న­మం­డ­లి ప్ర­తి­ప­క్ష నేత, మాజీ మం­త్రి బొ­త్స సత్య­నా­రా­యణ అస్వ­స్థ­త­కు గు­ర­య్యా­ర­ని తె­లి­సి బా­ధ­ప­డ్డా­ను. ఆయన త్వ­ర­గా ఆరో­గ్య­వం­తు­లు కా­వా­ల­ని మన­స్ఫూ­ర్తి­గా ఆకాం­క్షి­స్తు­న్నా­ను. ఆయ­న­కు సం­పూ­ర్ణ ఆయు­రా­రో­గ్యా­ల­ను ప్ర­సా­దిం­చా­ల­ని ఆ భగ­వం­తు­డి­ని ప్రా­ర్థి­స్తు­న్నా­ను," అని పవన్ కల్యా­ణ్ తన ప్ర­క­ట­న­లో పే­ర్కొ­న్నా­రు. రా­జ­కీ­యా­ల్లో ప్ర­త్య­ర్థు­లై­న­ప్ప­టి­కీ, బొ­త్స ఆరో­గ్యం పట్ల పవన్ కల్యా­ణ్ చూ­పిన మా­న­వ­త్వం రా­జ­కీయ వర్గా­ల్లో చర్చ­నీ­యాం­శ­మైం­ది. ప్ర­స్తు­తం బొ­త్స సత్య­నా­రా­యణ ఆరో­గ్యం ని­ల­క­డ­గా ఉం­ద­ని, ఆయన త్వ­ర­లో­నే డి­శ్చా­ర్జ్ అయ్యే అవ­కా­శం ఉం­ద­ని సమా­చా­రం.

Tags:    

Similar News