AMARAVATHI: భూమి లేని పేదలకు పింఛన్..నెలకు రూ.5 వేలు

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం... అమరావతిలో భూమి లేని పేదలకు పింఛన్లు... కసరత్తు చేస్తున్న సీఆర్డీఏ అధికార బృందం... పింఛన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న కమిటీ

Update: 2025-12-14 05:30 GMT

రా­జ­ధా­ని అమ­రా­వ­తి­లో భూ­మి­లే­ని పే­ద­ల­కు పిం­ఛ­న్లు ఇవ్వ­టా­ని­కి సీ­ఆ­ర్‌­డీఏ చర్య­లు చే­ప­ట్టిం­ది. త్రి­స­భ్య కమి­టీ సమా­వే­శం­లో 4,929 మంది పిం­ఛ­న్ల పు­న­రు­ద్ధ­ర­ణ­పై కీలక ని­ర్ణ­యం తీ­సు­కు­న్నా­రు. త్రి­స­భ్య కమి­టీ ని­ర్ణ­యం మే­ర­కు అర్హు­లైన వా­రి­కి నె­ల­కు రూ.5 వేల పె­న్ష­న్‌ ఇవ్వ­టా­ని­కి సీ­ఆ­ర్డీఏ ఏర్పా­ట్లు చే­స్తోం­ది. రా­జ­ధా­ని­కి భూ­స­మీ­క­రణ జరి­గిన సమ­యం­లో భూమి లేని పే­ద­ల­కు ఉపా­ధి­కి ఇబ్బం­ది లే­కుం­డా పె­న్ష­న్ ఇవ్వా­ల­ని ప్ర­భు­త్వం ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. అప్ప­ట్లో 4,929 మంది పే­ద­లు పె­న్ష­న్లు తీ­సు­కు­నే­వా­రు. వై­కా­పా ప్ర­భు­త్వం వచ్చిన తర్వాత రా­జ­ధా­ని పను­లు ని­లి­పి­వే­య­టం­తో పాటు.. పే­ద­ల­కు పె­న్ష­న్లు రద్దు చే­సిం­ది. ఇప్పు­డు వా­రం­ద­రి­కీ పు­న­రు­ద్ద­రిం­చేం­దు­కు సీ­ఆ­ర్డీఏ దర­ఖా­స్తు­లు స్వీ­క­రిం­చా­ల­ని ని­ర్ణ­యిం­చిం­ది. గ్రా­మా­ల్లో­ని సీ­ఆ­ర్‌­డీఏ కా­ర్యా­ల­యా­ల్లో పె­న్ష­న్ దర­ఖా­స్తు­లు ఇవ్వా­ల­ని కమి­ష­న­ర్ కన్న­బా­బు ఓ ప్ర­క­ట­న­లో తె­లి­పా­రు. గ్రా­మ­స­భల సమ­యం­లో­నూ అర్జీ­లు సమ­ర్పిం­చ­వ­చ్చ­న్నా­రు. భూమి లేని పే­ద­ల­కు న్యా­యం చే­స్తా­మ­ని కమి­ష­న­ర్ కన్న­బా­బు తె­లి­పా­రు.

త్రిసభ్య కమిటీ భేటీలో..

కూ­ట­మి ప్ర­భు­త్వం ఏర్పా­టు చే­సిన త్రి­స­భ్య కమి­టీ సమా­వే­శం­లో అమ­రా­వ­తి­లో భూమి లేని పే­ద­ల­కు పిం­ఛ­న్లు ఇవ్వా­ల­ని ని­ర్ణ­యిం­చా­రు. మొ­త్తం 4,929 మం­ది­కి పిం­ఛ­న్ల పు­న­రు­ద్ధ­ర­ణ­పై త్రి­స­భ్య కమి­టీ సమా­వే­శం­లో కీలక ని­ర్ణ­యం తీ­సు­కు­న్నా­రు. వీ­రి­కి నె­ల­కు 5 వేల రూ­పా­య­లు చొ­ప్పున పిం­ఛ­న్ ఇచ్చేం­దు­కు సీ­ఆ­ర్డీఏ చర్య­లు ప్రా­రం­భిం­చిం­ది. మరో­వై­పు అమ­రా­వ­తి రా­జ­ధా­ని­కి భూ­స­మీ­క­రణ చే­సిన సమ­యం­లో.. భూమి లేని పేద ప్ర­జ­లు ఇబ్బం­దు­లు పడ­కూ­డ­ద­నే ఉద్దే­శం­తో పిం­ఛ­న్ అం­దిం­చా­ల­ని అప్ప­ట్లో ప్ర­భు­త్వం ని­ర్ణ­యిం­చిం­ది. అలా­గే భూమి లేని 4,929 మంది పే­ద­ల­కు పిం­ఛ­న్లు అం­దిం­చే­వా­రు. అయి­తే ఆ తర్వా­తి కా­లం­లో రా­జ­ధా­ని పను­లు ని­లి­చి­పో­యా­యి. కొం­త­మం­ది పే­ద­ల­కు పిం­ఛ­న్లు కూడా రద్ద­య్యా­యి. అయి­తే టీ­డీ­పీ కూ­ట­మి సర్కా­రు అధి­కా­రం­లో­కి రా­వ­టం­తో వీ­రి­కి పిం­ఛ­న్లు పు­న­రు­ద్ధ­రిం­చా­ల­ని ని­ర్ణ­యిం­చా­రు. ఇం­దు­కో­సం సీ­ఆ­ర్డీఏ దర­ఖా­స్తు­లు స్వీ­క­రిం­చ­నుం­ది. అర్హు­లైన వారు గ్రా­మా­ల్లో­ని సీ­ఆ­ర్‌­డీఏ కా­ర్యా­ల­యా­ల్లో పిం­ఛ­న్ల కోసం దర­ఖా­స్తు­లు ఇవ్వా­ల­ని సీ­ఆ­ర్డీఏ కమి­ష­న­ర్ కన్న­బా­బు ఓ ప్ర­క­ట­న­లో వె­ల్ల­డిం­చా­రు. గ్రా­మ­స­భల సమ­యం­లో­నూ పిం­ఛ­న్ల కోసం అర్జీ­లు సమ­ర్పిం­చ­వ­చ్చ­ని సూ­చిం­చా­రు. అమ­రా­వ­తి పరి­ధి­లో­ని భూమి లేని పే­ద­ల­కు న్యా­యం చే­స్తా­మ­ని హామీ ఇచ్చా­రు.

మరో­వై­పు అమ­రా­వ­తి కోసం గత టీ­డీ­పీ ప్ర­భు­త్వం 33 వేల ఎక­రాల భూ­మి­ని రై­తుల నుం­చి సమీ­క­రిం­చిన సం­గ­తి తె­లి­సిం­దే. వా­రి­కి రి­ట­ర్న­బు­ల్ ప్లా­ట్ల­తో పా­టు­గా కౌలు చె­ల్లిం­పు­లు చే­స్తోం­ది. అయి­తే భూమి లేని పే­ద­ల­కు కూడా పిం­ఛ­న్లు అం­దిం­చా­ల­నే ఉద్దే­శం­తో 2015-16 మధ్య­కా­లం­లో.. 29 గ్రా­మా­ల్లో 21,374 భూమి లేని కు­టుం­బా­ల­ను అప్ప­టి టీ­డీ­పీ ప్ర­భు­త్వం గు­ర్తిం­చిం­ది. వా­రి­కి నె­ల­కు రూ. 2,500 చొ­ప్పున పిం­ఛ­న్లు ఇచ్చిం­ది. వై­సీ­పీ ప్ర­భు­త్వం అధి­కా­రం­లో­కి వచ్చిన అనం­త­రం 2024 ఫి­బ్ర­వ­రి­లో ఈ పిం­ఛ­న్ మొ­త్తా­న్ని పెం­చా­రు. 2 వేల 500 రూ­పా­యల నుం­చి 5 వేల రూ­పా­య­ల­కు పెం­చా­రు. అయి­తే కరెం­ట్ బి­ల్లు సహా వి­విధ సాం­కే­తిక కా­ర­ణా­ల­తో లబ్ధి­దా­రుల సం­ఖ్య­ను కు­దిం­చా­ర­నే వి­మ­ర్శ­లు ఉన్నా­యి. అయి­తే 2024 ఎన్ని­క­ల్లో గె­లి­చి టీ­డీ­పీ కూ­ట­మి అధి­కా­రం­లో­కి వచ్చిన తర్వాత భూమి లేని పే­ద­ల­కు ఇచ్చే పిం­ఛ­న్ల కా­ల­ప­రి­మి­తి­ని మరో ఐదే­ళ్లు పెం­చా­రు.

అమరావతి రైతులకు శుభవార్త

అమ­‌­రా­వ­‌­తి రై­తు­ల­కు ప్ర­భు­త్వం ప్లా­ట్ల కే­టా­యిం­పు­పై తీ­పి­క­బు­రు చె­ప్పిం­ది. రా­య­‌­పూ­డి సీ­ఆ­ర్డీఏ కా­ర్యా­ల­‌­యం­లో త్రి­స­‌­భ్య క‌­మి­టీ స‌­మా­వే­శం ని­ర్వ­హిం­చా­రు.. రా­జ­‌­ధా­ని రై­తుల స‌­మ­‌­స్య­ల­పై క‌­మి­టీ చర్చిం­చిం­ది. ఈ స‌­మా­వే­శా­ని­కి కేం­ద్ర మం­త్రి పె­మ్మ­సా­ని చం­ద్ర­శే­ఖ­ర్, మం­త్రి నా­రా­య­‌­ణ‌, ఎమ్మె­ల్యే శ్రా­వ­‌­ణ్ కు­మా­ర్, సీ­ఆ­ర్డీఏ అధి­కా­రు­లు హా­జ­ర­య్యా­రు. అమ­రా­వ­తి ప్రాంత రై­తుల స‌­మ­‌­స్యల ప‌­రి­ష్కా­రం­పై స‌­మా­వే­శం­లో ప్ర­ధా­నం­గా చ‌­ర్చిం­చా­మ­ని మం­త్రి నా­రా­యణ తె­లి­పా­రు. వారి సమ­స్య­ల్ని ఒక్కొ­క్క­టి­గా పరి­ష్క­రి­స్తా­మ­న్నా­రు. అమ­రా­వ­తి­లో రై­తు­ల­‌­కు కే­టా­యిం­చిన ప్లా­ట్ల­లో ఇప్ప­టి­వ­‌­ర­‌­కు 61,793 ప్లా­ట్ల రి­జి­స్ట్రే­ష­‌­న్ పూ­ర్త­య్యిం­ద­ని మం­త్రి నా­రా­యణ తె­లి­పా­రు. మరో 7628 ప్లా­ట్లు మా­త్ర­మే రి­జి­స్ట్రే­ష­‌­న్ చే­యా­ల్సి ఉం­ద­న్నా­రు. 29,233 మంది రై­తు­ల­కు ప్లా­ట్లు కే­టా­యిం­చా­మ­ని..312 కో­ర్టు కే­సు­లు పెం­డిం­గ్‌­లో ఉన్నా­యి అన్నా­రు. అయి­తే ఉం­డ­వ­ల్లి­లో రా­జ­ధా­ని కోసం భూమి ఇచ్చి­న‌ రై­తు­ల­కు త్వ­ర­లో లా­ట­రీ వి­ధా­నం­లో ప్లా­ట్లు కే­టా­యి­స్తా­మ­ని తె­లి­పా­రు. అమ­రా­వ­తి­లో­ని R5 జో­న్‌­పై మా­త్రం న్యా­య‌ స‌­ల­‌­హా తీ­సు­కుం­టు­న్నా­మ­ని తె­లి­పా­రు మం­త్రి నా­రా­యణ. జరీ­బు భూ­ముల సమ­స్య­ల­ను పరి­ష్క­రిం­చ­డా­ని­కి కేం­ద్ర మం­త్రి పె­మ్మ­సా­ని చం­ద్ర­శే­ఖ­ర్ ఒక నెల సమయం పడు­తుం­ద­ని చె­ప్పా­రు. నేల స్వ­భా­వం ఎలా ఉందో పరీ­క్ష­లు చేసి, ఆ తర్వా­తే తుది ని­ర్ణ­యం తీ­సు­కుం­టా­మ­ని ఆయన తె­లి­పా­రు.

Tags:    

Similar News