AMARAVATHI: అమరావతిలో ప్రతిష్టాత్మక నిర్మాణం పూర్తి.. 13న ప్రారంభం

Update: 2025-10-09 05:30 GMT

అమ­రా­వ­తి­లో సీ­ఆ­ర్‌­డీఏ ప్రా­జె­క్టు కా­ర్యా­ల­యం ప్రా­రం­భో­త్స­వా­ని­కి ము­హూ­ర్తం ఖరా­రైం­ది. అక్టో­బ­ర్ 13వ తేదీ సీఎం నారా చం­ద్ర­బా­బు నా­యు­డు చే­తుల మీ­దు­గా సీ­ఆ­ర్డీఏ ఆఫీ­సు ప్రా­రం­భం కా­నుం­ది. ఉదయం 9:54 ని­మి­షా­ల­కు సీ­ఆ­ర్డీఏ ప్రా­జె­క్టు కా­ర్యా­ల­యం ప్రా­రం­భో­త్స­వం జర­గ­నుం­ది. సీ­ఆ­ర్డీఏ ప్రా­జె­క్టు ఆఫీ­సు­ను మొ­త్తం ఏడు అం­త­స్తు­ల­లో ని­ర్మిం­చా­రు. 2014లో అప్ప­టి టీ­డీ­పీ ప్ర­భు­త్వం­లో ని­ర్మా­ణం ప్రా­రం­భం కాగా.. మధ్య­లో అధి­కా­రం చే­తు­లు మా­ర­టం­తో పను­ల్లో జా­ప్యం జరి­గిం­ది. ఎట్ట­కే­ల­కు ని­ర్మా­ణం పూ­ర్తి చే­సు­కు­న్న సీ­ఆ­ర్డీఏ ప్రా­జె­క్టు కా­ర్యా­ల­యం.. ప్రా­రం­భో­త్స­వా­ని­కి ము­స్తా­బైం­ది. సీడ్ యా­క్సె­స్ రో­డ్డు పక్క­నే రా­య­పూ­డి సమీ­పం­లో సీ­ఆ­ర్డీఏ కా­ర్యా­ల­యం ని­ర్మిం­చా­రు. ఆక­ట్టు­కు­నే ఇం­టీ­రి­య­ర్ డి­జై­న్స్, ఆధు­నిక ని­ర్మాణ శై­లి­తో సీ­ఆ­ర్డీఏ ఆఫీ­సు ని­ర్మిం­చా­రు. ఈ కా­ర్యా­ల­యం అం­దు­బా­టు­లో­కి వచ్చిన తర్వాత సీ­ఆ­ర్డీఏ కా­ర్య­క­లా­పా­లు­వి­జ­య­వాడ నుం­చి అమ­రా­వ­తి­కి మా­ర­ను­న్నా­యి. 2014 టీ­డీ­పీ ప్ర­భు­త్వ హయాం­లో సీ­ఆ­ర్డీఏ ఆఫీ­సు పను­లు ప్రా­రం­భిం­చా­రు. 2019 నా­టి­కి గ్రౌం­డ్ ఫ్లో­ర్, ఏడు అం­త­స్తుల స్ట్ర­క్చ­ర్ పూ­ర్తి చే­శా­రు.

ఏపీలో రోడ్లకు మహర్దశ

ఏపీ­లో రో­డ్లు అధ్వా­న్నం­గా మా­రా­యి. చాలా ప్రాం­తా­ల్లో రో­డ్ల­పై భా­రీ­గా గుం­త­లు ఏర్ప­డ్డా­యి. దీం­తో ఘోర రో­డ్డు ప్ర­మా­దా­లు జరు­గు­తు­న్నా­యి. ఈ ప్ర­మా­దా­ల్లో చాలా మంది ప్రా­ణా­లు కో­ల్పో­యా­రు. వందల సం­ఖ్య­లో ఆస్ప­త్రుల పా­ల­య్యా­రు. దీం­తో కొ­త్త రో­డ్ల­తో పాటు మర­మ్మ­తు­లు చే­యా­ల­నే డి­మాం­డ్లు వి­ని­పి­స్తు­న్నా­యి. కూ­ట­మి ప్ర­భు­త్వం అధి­కా­రం­లో­కి వచ్చి రెం­డే­ళ్ల­వు­తు­న్నా రో­డ్ల­ను పట్టిం­చు­కో­వ­డం­లే­ద­నే వి­మ­ర్శ­లు తీ­వ్ర­మ­య్యా­యి.ఈ నే­ప­థ్యం­లో ప్ర­భు­త్వం రో­డ్ల­పై దృ­ష్టి పె­ట్టిం­ది. రో­డ్లు, భవ­నాల శాఖ అధి­కా­రు­ల­తో చర్చిం­చిం­ది. మొ­త్తం 274 రో­డ్ల పను­లు చే­యా­ల­ని ని­ర్ణ­యిం­చిం­ది. ఈ మే­ర­కు రూ. 1000 కో­ట్లు ని­ధు­లు మం­జూ­రు చే­సిం­ది. ఇం­దు­కు అవ­స­ర­మైన అను­మ­తు­లు ఇస్తూ ఉత్త­ర్వు­లు జారీ చే­సిం­ది. ఈ దె­బ్బ­తో రా­ష్ట్రం­లో­ని రో­డ్ల­న్ని బా­గు­ప­డ­ను­న్నా­య­ని కూ­ట­మి నే­త­లు తె­లి­పా­రు. గత ప్ర­భు­త్వం­లో రో­డ్ల­ను పట్టిం­చు­కో­లే­ద­ని, తమ ప్ర­భు­త్వ అధి­కా­రం­లో­కి వచ్చి­న­ప్ప­టి నుం­చి అన్ని సమ­స్య­ల­ను పరి­ష్క­రి­స్తోం­ద­ని చె­ప్పా­రు. కూ­ట­మి ప్ర­భు­త్వం అధి­కా­రం­లో­కి వచ్చిన తర్వాత హా­మీల అమ­లు­పై దృ­ష్టి పె­ట్టిం­ది. రో­డ్ల­పై వి­మ­ర్శ­లు వస్తు­న్న వేళ వా­టి­ని మె­రు­గు పర్చా­ల­ని సర్కా­ర్ కం­క­ణం కట్టు­కుం­ది.

Tags:    

Similar News