293వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

Update: 2020-10-05 04:02 GMT

రాజధాని కోసం అమరావతి రైతులు, మహిళలు చేస్తోన్న ఆందోళనలు 293వ రోజుకు చేరుకుంది. మందడం, తూళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు తదితర గ్రామాల్లోని శిభిరాల్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు రాజధాని రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ... అమరావతి ఉద్యమం సాగుతోంది.

Tags:    

Similar News