Ys Jagan : గవర్నర్‌ విశ్వభూషణ్‌తో నేడు సీఎం జగన్ భేటీ

Ys Jagan : గవర్నర్ అపాయింట్‌మెంట్ ఖరారు కావడంతో సీఎంవో కార్యాలయానికి రాజ్‌భవన్ వర్గాలు సమాచారాన్ని అందించాయి.;

Update: 2022-04-06 02:30 GMT

YS Jagan : ఏపీ సీఎం జగన్ ఇవాళ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలవనున్నారు. గవర్నర్ అపాయింట్‌మెంట్ ఖరారు కావడంతో సీఎంవో కార్యాలయానికి రాజ్‌భవన్ వర్గాలు సమాచారాన్ని అందించాయి. దీంతో సీఎం జగన్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు గవర్నర్ ను కలవనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్.. ఇవాళ మధ్యాహ్నం విజయవాడ చేరుకోనున్నారు. అనంతరం గవర్నర్‌ను కలుస్తారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, జిల్లాల పునర్విభజన, ఢిల్లీలో ప్రధాని, హోం మంత్రితో భేటీ వివరాలను గవర్నర్‌కు వివరించనున్నారు. మరోవైపు ఈనెల 11న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని మంత్రులు చెబుతున్నారు. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనుంది. 11వ తేదీ ఉదయం 11 గంటల 31 నిమిషాలకు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు సీఎం జగన్ ముహూర్తం ఖరారు చేశారు.

Tags:    

Similar News