INDRAKEELADRI: సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు

ఇంద్రకీలాద్రిపై ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవాలు

Update: 2023-10-20 05:00 GMT

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మూలానక్షత్రం సందర్భంగా కనకదుర్గ అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు.


భక్తులు అధిక సంఖ్యలో వస్తారనే అంచనాతో అర్ధరాత్రి ఒకటిన్నర నుంచి దర్శనానికి అనుమతి కల్పించారు.


భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ దర్శనాలను అధికారులు రద్దుచేశారు. కొండపైకి, ఆలయ పరిసరాల్లోకి వాహనాలు రాకుండా పోలీసులు నిషేధించారు. 

Tags:    

Similar News