Andhra Pradesh: ఏపీ దేవాదాయశాఖలో దొడ్డిదారి ప్రమోషన్లకు రంగం సిద్ధం..

Andhra Pradesh: ఏపీ దేవాదాయశాఖలో దొడ్డిదారి ప్రమోషన్లకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Update: 2022-05-14 07:28 GMT

Andhra Pradesh: ఏపీ దేవాదాయశాఖలో దొడ్డిదారి ప్రమోషన్లకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. డిప్యూటీ కమీషనర్ల ప్రమోషన్ల వివాదం ఇప్పటికే కోర్టులో ఉంది. ప్రమోషన్లపై కోర్టు స్టే ఉన్నా.. ఆ ఉత్తర్వులకే అధికారులు వక్ర భాష్యం చెబుతున్నారన్న విమర్శలున్నాయి. దొడ్డి దారిన ప్రమోషన్ల కోసం సీనియారిటీని సైతం పక్కన పెడుతున్నారంటూ.. ఉన్నతాధికారుల తీరుపై ఎండోమెంట్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్లకు అవినీతి ఆరోపణలు అడ్డురావా అని ఉద్యోగులు సూటిగానే ప్రశ్నిస్తున్నారు. దేవాదాయశాఖను దోచుకున్న వారికే ప్రమోషన్లు ఇస్తారా అని ఎండోమెంట్ ఉద్యోగుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News