అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డిగా ఎపిసోడ్ మారింది. తాడిపత్రిలోకి యువగళం ప్రవేశించకముందే హై టెన్షన్ నెలకొంది. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి టీడీపీ యువనేత నారా లోకేష్కు సవాల్ విసిరారు. తనపై ఆరోపణలు చేసే ముందు ఆధారాలు చూపించాలన్నారు. ఒకవేళ ఆరోపణలకు ఆధారాలు చూపించకపోతే లోకేష్ శిబిరం వద్ద ఆందోళణ చేస్తానని హెచ్చరించారు. దీంతో ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దారెడ్డి తీరును తప్పుబట్టారు. దీంతో పరిటాల రవిని చంపిన జేసీ బ్రదర్స్తో పరిటాల కుటుంబం కలిసిపోవడం నీచ రాజకీయమన్నారు పెద్దారెడ్డి. జేసీ బ్రదర్స్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు వారి అవినీతిపై.. త్రిశూల్ గనుల అక్రమాలపై పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో ఆందోళన చేసింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు.