AP; ఏపీకి రూ.5,265 కోట్ల నష్టం: సీఎం చంద్రబాబు

తుఫానుతో ఏపీకి భారీ నష్టం వాటిల్లిందన్న సీఎం.. వ్యవసాయ రంగానికి రూ.829 కోట్ల నష్టం.. ఆర్‌అండ్‌బీకి రూ.2,079 కోట్ల మేర నష్టం.. 120 పశువులు మృత్యువాత పడ్డాయన్న సీఎం

Update: 2025-10-31 03:00 GMT

మొం­థా తు­ఫా­న్ ప్ర­భా­వం­తో రెం­డు తె­లు­గు రా­ష్ట్రా­లు అత­లా­కు­త­లం అయ్యా­యి. చాలా ప్రాం­తా­ల్లో ఇళ్లు నీట ము­ని­గా­యి. పంట పొ­లా­లు నా­శ­నం అయ్యా­యి. రో­డ్లు , రై­ల్వే ట్రా­క్‌­లు తె­గి­పో­యా­యి. ఈ నే­ప­థ్యం­లో బు­ధ­వా­రం తు­ఫా­న్ ప్ర­భా­విత జి­ల్లా­లో ఏపీ సీఎం చం­ద్ర­బా­బు పర్య­టిం­చా­రు. హె­లి­కా­ప్ట­ర్‌ ద్వా­రా ఏరి­య­ల్‌ సర్వే చేసి తర్వాత.. స్వ­యం­గా పొ­లాల దగ్గ­ర­కు వె­ళ్లి రై­తు­ల­తో మా­ట్లా­డా­రు.తు­ఫా­న్ ప్ర­భావ పరి­స్థి­తి, పంట, ఆస్తి నష్టం పై అధి­కా­రు­ల­తో సీఎం చం­ద్ర­బా­బు సమీ­క్ష ని­ర్వ­హిం­చా­రు. మొం­థా తు­ఫా­న్ ప్ర­భా­వం­తో దె­బ్బ­తి­న్న పంటు, ఆస్తి నష్టం­పై అధి­కా­రు­ల­తో ఏపీ సీఎం చం­ద్ర­బా­బు సమీ­క్ష ని­ర్వ­హిం­చా­రు. రా­ష్ట్ర వ్యా­ప్తం­గా తు­ఫా­న్ కా­ర­ణం­గా జరి­గిన పంట నష్టం పై ఇప్ప­టి­కే ప్ర­భు­త్వం ప్రా­థ­మిక అం­చ­నా­కు వచ్చి­న­ట్టు ఆయన తె­లి­పా­రు. వరి, మొ­క్క­జొ­న్న, పత్తి. అరటి, ఇతర ఉద్యాన వన పం­ట­లు బాగా దె­బ్బ­తి­న్న­ట్టు అధి­కా­రు­లు అం­చ­నా వే­శా­రు. అయి­తే ఐదు రో­జు­ల్లో­గా పంట నష్టం పూ­ర్తి ని­వే­దిక అం­దిం­చా­ల­ని సీఎం చం­ద్ర­బా­బు అధి­కా­రు­ల­కు సూ­చిం­చా­రు. తు­ఫా­ను ప్ర­భా­విత ప్రాం­తా­ల్లో నష్ట­పో­యిన ప్ర­తీ ఒక్క­రి­ని ఆదు­కుం­టా­మ­ని చం­ద్ర­బా­బు హా­మీ­ని­చ్చా­రు. బా­ధి­తు­ల­కు కూ­ట­మి ప్ఱ­భు­త్వం అం­డ­గా ఉం­టుం­ద­ని హామీ ఇచ్చా­రు. వరద గు­ప్పి­ట్లో ప్ర­జ­లు ఉంటే వై­సీ­పీ ఇంకా రా­జ­కీ­యా­లు చే­స్తోం­ద­ని మం­డి­ప­డ్డా­రు.

భారీ నష్టం

‘మొం­థా’ తు­పా­ను వల్ల రా­ష్ట్రా­ని­కి రూ.5,265 కో­ట్ల మేర నష్టం వా­టి­ల్లిం­ద­ని ప్రా­థ­మి­కం­గా అం­చ­నా వే­సి­న­ట్లు చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. వ్య­వ­సాయ రం­గా­ని­కి రూ.829 కో­ట్లు, ఆర్‌­అం­డ్‌­బీ­కి రూ.2,079 కో­ట్ల మేర నష్టం వా­టి­ల్లిం­ద­ని చె­ప్పా­రు. తు­పా­ను వల్ల ఎవరూ ప్రా­ణా­లు కో­ల్పో­లే­ద­న్న ఆయన.. 120 పశు­వు­లు మృ­త్యు­వాత పడి­న­ట్లు పే­ర్కొ­న్నా­రు. నీ­టి­పా­రు­దల శా­ఖ­కు సం­బం­ధిం­చి ఈసా­రి నష్టం తక్కు­వే ఉం­ద­న్నా­రు. తు­పా­ను నష్టం­పై సీఎం చం­ద్ర­బా­బు సమీ­క్ష ని­ర్వ­హిం­చా­రు. నష్టం వి­వ­రా­ల­ను అధి­కా­రు­లు ఆయ­న­కు వి­వ­రిం­చా­రు. అనం­త­రం చం­ద్ర­బా­బు మీ­డి­యా­తో మా­ట్లా­డు­తూ.. మొం­థా తు­పా­ను బీ­భ­త్సా­న్ని ముం­దు­గా­నే అం­చ­నా వే­శా­మ­ని, అం­దు­కే నష్టం తగ్గిం­ద­న్నా­రు. ‘‘ప్ర­తి కు­టుం­బా­న్ని, ఇం­టి­నీ జి­యో­ట్యా­గిం­గ్‌ చే­య­గ­లి­గాం. తు­పా­ను వల్ల మా­రు­తు­న్న పరి­ణా­మా­ల­కు తగ్గ­ట్లు­గా ని­ర్ణ­యా­లు తీ­సు­కు­న్నాం. గతం­లో వి­ద్యు­త్‌ సర­ఫ­రా ఆగి­తే 10 గంటల వరకు వచ్చే­ది కాదు. ప్ర­స్తు­తం వి­ద్యు­త్‌ సర­ఫ­రా ఆగి­నా 3 గం­ట­ల్లో­నే పు­న­రు­ద్ధ­రణ జరి­గిం­ది. అం­ద­రూ ని­బ­ద్ధ­త­తో పని చే­శా­రు. చాలా సం­తో­షం­గా ఉంది. ఓ వైపు వర్షం పడు­తు­న్నా.. చె­ట్ల­ను తొ­ల­గిం­చి ఇబ్బం­దు­లు లే­కుం­డా చే­శా­రు. ’’ అని చం­ద్ర­బా­బు తె­లి­పా­రు.

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన డిప్యూటీ సీఎం


ఏపీ డి­ప్యూ­టీ సీఎం పవ­న్‌ కల్యా­ణ్‌ కృ­ష్ణా జి­ల్లా అవ­ని­గ­డ్డ ని­యో­జ­క­వ­ర్గం­లో­ని కో­డూ­రు మం­డ­లం కృ­ష్ణా­పు­రం గ్రా­మం­లో పర్య­టిం­చా­రు. ‘మొం­థా’ తు­పా­ను ప్ర­భా­వం­తో దె­బ్బ­తి­న్న పంట పొ­లా­ల­ను పరి­శీ­లిం­చా­రు. రై­తు­ల­తో మా­ట్లా­డి వి­వ­రా­లు తె­లు­సు­కు­న్నా­రు. ప్ర­భు­త్వం అం­డ­గా ఉం­టుం­ద­ని వా­రి­కి హామీ ఇచ్చా­రు. తు­పా­ను ప్ర­భా­వం తీ­వ్రం­గా ఉన్న గ్రా­మా­ల్లో సూ­ప­ర్ క్లో­రి­నే­ష­న్, సూ­ప­ర్ శా­ని­టే­ష­న్ కా­ర్య­క్ర­మా­ల­ను మొ­ద­లు­పె­ట్టా­ల­ని ఆదే­శిం­చా­రు. తు­పా­ను ప్ర­భా­వం వల్ల పా­డైన రో­డ్ల­ను ప్రా­ధా­న్య ప్ర­కా­రం బాగు చే­యా­ల­న్నా­రు. క్షే­త్ర­స్థా­యి­లో ప్ర­స్తుత పరి­స్థి­తి­ని అడి­గి తె­లు­సు­కు­న్నా­రు. తీ­సు­కో­వా­ల్సిన చర్య­ల­ను తక్ష­ణ­మే మొ­ద­లు­పె­ట్టా­ల­ని డి­ప్యూ­టీ సీఎం పవన్ ఆదే­శిం­చా­రు. 

బాధితులకు అండగా ఉంటాం

ప్ర­భు­త్వం రై­తుల పక్షాన ని­ల­బ­డి, అన్ని వి­ధాల సహా­యం అం­ది­స్తుం­ద­ని పవన్ హామీ ఇచ్చా­రు. రై­తుల పంట నష్టా­ల­పై అధి­కా­రు­ల­ను సమ­గ్ర ని­వే­దిక ఇవ్వా­ల­ని ఆదే­శిం­చా­రు. ఇది­లా ఉంటే మొం­థా తు­ఫా­న్ ప్ర­భా­వం­తో కృ­ష్ణా, గుం­టూ­రు జి­ల్లా­ల్లో వేల ఎక­రాల వ్య­వ­సాయ భూమి దె­బ్బ­తి­న్న­ట్లు అం­చ­నా. కే­వ­లం కృ­ష్ణా జి­ల్లా­లో­నే 2.5 లక్షల ఎక­రా­ల్లో వరి పంట తీ­వ్రం­గా నష్ట­పో­యిం­ది. అరటి, బొ­ప్పా­యి గా­లి­వా­న­తో నే­ల­మ­ట్ట­మ­య్యా­యి. తు­ఫా­న్ తా­కి­డి­తో చె­రు­వు­ల్లా మా­రిన పొ­లాల దృ­శ్యా­లు హృ­ద­య­వి­దా­ర­కం­గా మా­రా­యి. ఈ నే­ప­థ్యం­లో రా­ష్ట్ర ప్ర­భు­త్వం రై­తు­ల­కు తగిన పరి­హా­రం అం­దిం­చేం­దు­కు ప్ర­ణా­ళి­క­లు రూ­పొం­ది­స్తు­న్న­ట్లు సమా­చా­రం అం­దు­తుం­ది. ఈ క్ర­మం­లో డి­ప్యూ­టీ సీఎం పవన్ కల్యా­ణ్ సహా.. ఇతర మం­త్రు­లు ఈ రోజు వరద ప్ర­భా­విత ప్రాం­తా­ల్లో పర్య­టిం­చా­రు. సీఎం చం­ద్ర­బా­బు ముం­దు జా­గ్ర­త్త­తో తు­పా­ను వల్ల జరి­గే నష్టం అధి­కం­గా జర­గ­కుం­డా చూ­శా­మ­ని అన్నా­రు. భారీ వర్షాల కా­ర­ణం­గా 46 వేల హె­క్టా­ర్ల­లో పంట నష్టం వచ్చిం­ద­ని, దీం­తో 56 వేల మంది రై­తు­లు తీ­వ్రం­గా నష్ట­పో­యా­ర­ని, వీ­రి­లో అత్య­ధి­కం­గా కౌ­లు­రై­తు­లే ఉన్నా­ర­ని, వా­రం­ద­రి­ని ఆదు­కు­నేం­దు­కు చం­ద్ర­బా­బు­తో రి­వ్యూ మీ­టిం­గ్ లో చర్చిం­చి ని­ర్ణ­యం తీ­సు­కుం­టా­మ­ని అన్నా­రు.

Tags:    

Similar News