YOGA: యోగాంధ్ర సూపర్ హిట్

ఒకేసారి రెండు గిన్నీస్ రికార్డు సృష్టించడం అరుదైన విషయమన్న చంద్రబాబు;

Update: 2025-06-22 03:00 GMT

వి­శా­ఖ­లో ని­ర్వ­హిం­చిన 11వ అం­త­ర్జా­తీయ యోగా ది­నో­త్స­వం వి­జ­య­వం­త­మైం­ద­ని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు ప్ర­క­టిం­చా­రు. యో­గాం­ధ్ర సూ­ప­ర్ హిట్ అని అన్నా­రు. అం­త­ర్జా­తీయ యోగా ది­నో­త్స­వం ని­ర్వ­హణ ద్వా­రా సరి­కొ­త్త చరి­త్ర సృ­ష్టిం­చా­మ­ని తె­లి­పా­రు. 3 లక్షల 3వేల మం­ది­కి పైగా అను­కు­న్న సమ­యా­ని­కి వే­దిక వద్ద­కు చే­రు­కు­న్నా­ర­ని.. ఒకే­సా­రి రెం­డు గి­న్నీ­స్ రి­కా­ర్డు­లు సృ­ష్టిం­చ­టం ఇదే ప్ర­థ­మ­మ­ని అన్నా­రు. ప్ర­జా చై­త­న్యం­తో­నే ఈ వి­జ­యం సా­ధిం­చా­మ­న్నా­రు. ప్ర­కృ­తి కూడా కరు­ణిం­చిం­ద­ని చం­ద్ర­బా­బు చె­ప్పా­రు. 20 రో­జుల క్రి­తం వర్షం పడు­తుం­ద­ని చూ­పిం­చ­టం­తో ప్ర­త్యా­మ్నాయ ఏర్పా­ట్లు చే­శా­మ­ని.. వరు­ణ­దే­వు­డు కూడా కరు­ణిం­చా­డ­న్నా­రు. అన్ని దే­శా­లు గు­ర్తిం­చే­లా ప్ర­ధాన మం­త్రి నరేం­ద్ర మోదీ యో­గాం­ధ్ర­కు వి­శేష ప్రా­చు­ర్యం కల్పిం­చా­ర­ని చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. ఇంత పె­ద్ద వే­డు­క­ను చి­న్న ఇబ్బం­ది కూడా లే­కుం­డా సాం­కే­తిక సా­యం­తో వి­జ­య­వం­తం చే­సిన ప్ర­తీ ఒక్క­రి­కీ అభి­నం­ద­న­లు తె­లి­య­జే­శా­రు.

 100 పర్యాటక ప్రదేశాల్లో...

26 జి­ల్లా­ల్లో 26 థీమ్ బేస్ యోగా ని­ర్వ­హిం­చా­మ­న్నా­రు. 100 పర్యా­టక ప్ర­దే­శా­ల్లో అను­కుం­టే 101 చో­ట్ల చే­శా­ర­ని చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. లక్ష­కు పైగా ప్ర­దే­శా­ల్లో రెం­డు­న్నర కో­ట్ల­మం­ది యోగా చే­సి­న­ట్లు వె­ల్ల­డిం­చా­రు. వి­శా­ఖ­లో 10 ఏళ్ల క్రి­తం హుద్ హుద్ పరి­ణా­మా­ల­ను ఈ సం­ద­ర్భం­గా సీఎం గు­ర్తు చే­సు­కు­న్నా­రు. నాడు దీ­పా­వ­ళి టపా­సు­లు కా­ల్చొ­ద్దం­టే మా­నే­శా­ర­ని.. నేడు యో­గా­కు రమ్మం­టే ఉత్సా­హం­గా తర­లి­వ­చ్చా­ర­ని హర్షం వ్య­క్తం చే­శా­రు. కా­ర్య­క్ర­మం­లో భా­గ­స్వా­ము­లైన వా­రి­కీ సీఎం అభి­నం­ద­న­లు తె­లి­య­జే­శా­రు.

 ప్రధానికి సీఎం కృతజ్ఞతలు

యోగా డే నిర్వహణపై ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటిస్తామని చంద్రబాబు వెల్లడించారు. గేమ్ ఛేంజర్‌గా నిలిచిన ఈ వేడుకకు ఓ లాజికల్ ముగింపు ఇస్తామని తెలిపారు. యోగా వల్ల కుటుంబానికి భారం కాదని.. రాష్ట్రానికి భారం కాదని గుర్తించాలన్నారు. ఇంకా పెద్ద ఎత్తున యోగాంధ్రను ప్రోత్సహిస్తామని చెప్పారు. డిజిటల్ హెల్త్ కార్డులకు సంబంధించి బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి నూతన ఒరవడిలు సృష్టిస్తున్నామన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుతూ వైద్య ఖర్చులు బాగా తగ్గేలా ఈ ప్రాజెక్టు రూపొందుతోందన్నారు. మంత్రి లోకేష్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం పనితీరు వల్ల ప్రజా చైతన్యం పెరిగిందని ప్రధాని గుర్తించారన్నారు. వాస్తవాలు లేకుంటే ప్రధాని మాట్లాడరని.. ప్రధాని ప్రశంసలకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News