AP: ఏపీలో పుట్టిన ప్రతీ బిడ్డా అదృష్టవంతుడే

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు.. భాగస్వామ్య సదస్సులో భారీ పెట్టుబడులు.. దేశానికి గేట్‌వేలా విశాఖ మారుతోందన్నసీఎం

Update: 2025-11-15 04:30 GMT

దేశానికి గ్రోత్ ఇంజన్‌గా ఏపీ, ఏపీకి గ్రోత్ కారిడార్‌గా విశాఖ తయారవుతున్నాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతి నిర్మాణం, విశాఖ అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేగంగా చేస్తున్నారన్నారు. ఏపీకి వచ్చే పెట్టుబడులకు అనుమతులు, భూములు కేటాయించి త్వరితగతిన ఉత్పత్తి దశకు చేరుకునేలా చేయూత ఇస్తున్నామన్నారు. ఏపీలో, కేంద్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్లు ఉన్నాయని పేర్కొన్నారు. 

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­కు పె­ట్టు­బ­డి­దా­రు­ల­ను ఆక­ర్షిం­చ­డం­లో ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు ముం­దుం­టా­ర­న్నా­రు ఉప­రా­ష్ట్ర­ప­తి సీపీ రా­ధా­కృ­ష్ణ­న్. ఏపీ­లో ప్ర­శాం­త­మైన వా­తా­వ­ర­ణం ఉం­ద­ని.. వ్యా­పార అను­కూల రా­ష్ట్రం­గా ని­లి­చిం­ద­న్నా­రు. ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­ష్ట్ర వి­భ­జన తర్వాత ఎన్నో ఇబ్బం­దు­లు ఎదు­ర్కొం­ద­న్నా­రు. మళ్లీ రా­ష్ట్రం తి­రి­గి గా­డి­లో పడు­తుం­ద­న్నా­రు. ప్ర­పంచ నలు­మూ­లల నుం­చి వచ్చి రా­ష్ట్రం­లో పె­ట్టు­బ­డు­లు పె­డు­తు­న్నా­ర­ని.. ఈజ్‌ ఆఫ్‌ డూ­యిం­గ్‌ బి­జి­నె­స్‌­తో­నే పె­ట్టు­బ­డు­లు వస్తా­య­న్నా­రు. చం­ద్ర­బా­బు మూడు దశా­బ్దా­లు­గా తనకు స్నే­హి­తు­డ­ని.. ఆయన సా­ర­థ్యం­లో ఏపీ­కి అనేక పె­ట్టు­బ­డు­లు వచ్చా­య­న్నా­రు. లక్ష్యం పె­ట్టు­కో­వ­డం సు­ల­భం.. అక్క­డి­కి చే­రు­కో­వ­డం కష్ట­మ­న్నా­రు. ఈ సీఐఐ భా­గ­స్వా­మ్య సద­స్సు­కు 72 దే­శాల ప్ర­తి­ని­ధు­లు వచ్చా­ర­న్నా­రు. ఆం­ధ్ర­ప్ర­దే­శ్ దే­శా­ని­కి గే­ట్‌­వే­లా మా­రు­తోం­ద­న్నా­రు.

రూ.లక్షా10వేల కోట్ల పెట్టుబడి

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­కు మరో భారీ పె­ట్టు­బ­డి వచ్చిం­ద­ని మం­త్రి నారా లో­కే­శ్‌ ప్ర­క­టిం­చా­రు. బ్రూ­క్‌­ఫీ­ల్డ్‌ అసె­ట్‌ మే­నే­జ్‌­మెం­ట్‌ రూ.లక్షా పది వేల కో­ట్ల పె­ట్టు­బ­డి పె­డు­తోం­ద­ని తె­లి­పా­రు. పు­న­రు­త్పా­దక వి­ద్యు­త్‌, బ్యా­ట­రీ, పం­ప్డ్‌ స్టో­రే­జ్‌ రం­గా­ల్లో బ్రూ­క్‌­ఫీ­ల్డ్‌ పె­ట్టు­బ­డు­లు పె­డు­తు­న్న­ట్లు చె­ప్పా­రు. రి­య­ల్‌­ఎ­స్టే­ట్‌, బీ­సీ­సీ­లు, ఇన్‌­ఫ్రా, పో­ర్టు­ల్లో­నూ పె­ట్టు­బ­డు­లు వస్తు­న్న­ట్లు ట్వీ­ట్ చే­శా­రు.

కుప్పానికి మరో పరిశ్రమ

చి­త్తూ­రు జి­ల్లా కు­ప్పం ని­యో­జ­క­వ­ర్గం గు­డు­ప­ల్లె­లో రూ.898.88 కో­ట్ల పె­ట్టు­బ­డి వచ్చిం­ది. ఈ మే­ర­కు హ్వా­సం­గ్‌ కం­పె­నీ గ్రీ­న్‌­ఫీ­ల్డ్‌ నా­న్‌­లె­ద­ర్‌ ఫు­ట్‌­వే­ర్‌ తయా­రీ యూ­ని­ట్‌ ఏర్పా­టు­కు ప్ర­భు­త్వం 100 ఎక­రా­లు కే­టా­యిం­చిం­ది. రెం­ట్‌ ఫ్రీ లీజు పద్ధ­తి­లో 50 ఏళ్ల­పా­టు ఇచ్చి, సె­జ్‌ హోదా కల్పిం­చ­నుం­ది. ఈ కం­పె­నీ ఏర్పా­టు­తో 17,645 మం­ది­కి ఉపా­ధి లభిం­చ­నుం­ది.

ఫోర్జ్‌ రూ.2వేల కోట్ల పెట్టుబడి

శ్రీ­స­త్య­సా­యి జి­ల్లా మడ­క­శి­ర­లో భా­ర­త్‌ ఫో­ర్జ్‌ రక్ష­ణ­రంగ ఉత్ప­త్తుల తయా­రీ కేం­ద్రం ఏర్పా­టు చే­స్తోం­ది. వీరు దశ­ల­వా­రీ­గా రూ.2,000 కో­ట్ల పె­ట్టు­బ­డు­లు పె­డ­తా­రు. ఇది ఆరం­భం మా­త్ర­మే­న­ని.. భవి­ష్య­త్తు­లో ఏపీ­తో అను­బం­ధం కొ­న­సా­గు­తుం­ద­ని, వి­విధ రం­గా­ల్లో పె­ట్టు­బ­డు­లు పె­డ­తా­మ­న్నా­రు భా­ర­త్‌ ఫో­ర్జ్‌ వై­స్‌­ఛై­ర్మ­న్, జా­యిం­ట్‌ మే­నే­జిం­గ్‌ డై­రె­క్ట­ర్, సీఐఐ ఐరో­పా కౌ­న్సి­ల్‌ ఛై­ర్మ­న్‌ అమి­త్‌ కల్యా­ణి. వచ్చే నా­లు­గై­దే­ళ్ల­లో వి­విధ రకాల గ్రీ­న్ ఎన­ర్జీ ప్రా­జె­క్టు­ల్లో రూ.82వేల కో­ట్ల పె­ట్టు­బ­డు­లు పె­డ­తా­మ­ని రె­న్యూ ఎన­ర్జీ వ్య­వ­స్థా­పక ఛై­ర్మ­న్, సీఈఓ సు­మం­త్‌ సి­న్హా తె­లి­పా­రు.

Tags:    

Similar News