AP: ఏపీలో డ్రోన్‌, స్పేస్‌ సిటీలకు శంకుస్థాపన

ఏపీకి పెట్టుబడుల వెల్లువ

Update: 2025-11-14 14:25 GMT

ఏపీ­లో మరో రెం­డు అభి­వృ­ద్ధి కా­ర్య­క్ర­మా­లు పు­రు­డు­పో­సు­కు­న్నా­యి. దే­శం­లో­నే తొ­లి­సా­రి­గా రా­ష్ట్రం­లో డ్రో­న్, స్పే­స్ సి­టీ­లు ఏర్పా­టు­కు సీఎం చం­ద్ర­బా­బు శ్రీ­కా­రం చు­ట్టా­రు. ఈ రెం­డిం­టి­కి వర్చు­వ­ల్‌­గా శం­కు­స్థా­పన చే­శా­రు. రా­ష్ట్రా­న్ని గ్రీ­న్ హై­డ్రో­జ­న్ వ్యా­లీ­గా తీ­ర్చి­ది­ద్ద­డ­మే లక్ష్యం­గా పె­ట్టు­కు­న్న చం­ద్ర­బా­బు డ్రో­న్, స్పే­స్ సి­టీ­ల­ను ఏర్పా­టు చే­యా­ల­ని ని­ర్ణ­యిం­చా­రు. ఇం­దు­లో భా­గం­గా కర్నూ­లు జి­ల్లా ఓర్వ­క­ల్లు­లో 300 ఎక­రా­ల్లో డ్రో­న్, స్పే­స్ సిటీ ని­ర్మా­ణం చే­యా­ల­ను­కు­న్నా­రు. ఈ మే­ర­కు సీఎం చం­ద్ర­బా­బు నా­యు­డు కేం­ద్రం సాయం కో­రా­రు. సా­ను­కూ­లం­గా స్పం­దిం­చ­డ­మే కా­కుం­డా డ్రో­న్, స్పే­స్ సి­టీ­ల­కు ఏర్పా­టు­పై హామీ ఇచ్చిం­ది. వి­శాఖ సీఐఐ సద­స్సు­కు హా­జ­రైన గో­య­ల్ శు­క్ర­వా­రం డ్రో­స్, స్పే­స్ సి­టీ­ల­కు సీఎం చం­ద్ర­బా­బు నా­యు­డు­తో కలి­సి వర్చు­వ­ల్‌­గా శం­కు­స్థా­పన చే­శా­రు.

ఏపీకి మరో భారీ పెట్టుబడి.. ప్రకటించిన లోకేశ్‌

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­కు భారీ పె­ట్టు­బ­డి రా­బో­తోం­దం­టూ రా­ష్ట్ర ఐటీ, వి­ద్యా­శాఖ మం­త్రి నారా లో­కే­శ్ చే­సిన ట్వీ­ట్‌­తో నె­ల­కొ­న్న ఉత్కం­ఠ­కు తె­ర­ప­డిం­ది. ప్ర­ముఖ అం­త­ర్జా­తీయ సం­స్థ బ్రూ­క్‌­ఫీ­ల్డ్ అసె­ట్ మే­నే­జ్‌­మెం­ట్ రా­ష్ట్రం­లో ఏకం­గా 12 బి­లి­య­న్ డా­ల­ర్లు (సు­మా­రు రూ.1.1 లక్షల కో­ట్లు) పె­ట్టు­బ­డి పె­ట్టేం­దు­కు ముం­దు­కొ­చ్చిం­ద­ని ఆయన అధి­కా­రి­కం­గా ప్ర­క­టిం­చా­రు. ఈ చరి­త్రా­త్మక పె­ట్టు­బ­డి­తో ఏపీ ప్ర­గ­తి పథం­లో మరో ముం­ద­డు­గు వే­య­నుం­ద­ని ఆయన స్ప­ష్టం చే­శా­రు. ఈ పె­ట్టు­బ­డి ద్వా­రా ప్ర­ధా­నం­గా పు­న­రు­త్పా­దక ఇం­ధ­నం, బ్యా­ట­రీ, పం­ప్డ్ స్టో­రే­జ్, సో­లా­ర్ తయా­రీ, ఇతర డీ­కా­ర్బ­నై­జే­ష­న్ కా­ర్య­క్ర­మా­ల­పై దృ­ష్టి సా­రిం­చ­ను­న్న­ట్టు లో­కే­శ్ తన ప్ర­క­ట­న­లో తె­లి­పా­రు. వీ­టి­తో పాటు డేటా సెం­ట­ర్లు, వా­ణి­జ్య రి­య­ల్ ఎస్టే­ట్, గ్లో­బ­ల్ క్యా­ప­బి­లి­టీ సెం­ట­ర్లు (జీ­సీ­సీ), మౌ­లిక సదు­పా­యా­లు, పో­ర్టుల వంటి వి­భి­న్న రం­గా­ల్లో­నూ బ్రూ­క్‌­ఫీ­ల్డ్ పా­లు­పం­చు­కో­నుం­ది.



Tags:    

Similar News