AP Government : మెటర్నిటీ లీవ్స్ ను 180 రోజులకు పెంచిన ఏపీ సర్కార్

Update: 2025-05-07 06:30 GMT

మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మాతృత్వ సెలవులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 120 మెటర్నిటీ లీవ్స్ ఇస్తుండగా.. వాటిని 180 రోజులకు పెంచింది. ఈ మేరకు సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గతంలో ఇద్దరు పిల్లలకు మాత్రమే ప్రసూతి సెలవులు వర్తించేవి. కానీ తాజాగా విడుదల చేసిన జీవోలో ఆ కండిషన్ ను తీసేసింది. ఎంతమంది పిల్లలను కన్నా మాతృత్వ సెల వులను పొందవచ్చని ఆ జీవోలో పేర్కొంది. ఈ నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తా యని తెలిపింది. కాగా, కొత్తగా ఉద్యోగంలో చేరిన ప్రభుత్వ ఉద్యోగినులకు కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాలని ఇటీవల ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసింది. ప్రొబేష న క్కు మాతృత్వ సెలవులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అప్పుడు గెజిట్ రిలీజ్ చేసింది. తాజాగా ఇద్దరు పిల్లలకే ప్రసూతి సెలవులు అన్న నిబంధనను కూడా తొలగించింది. సంతా నోత్పత్తిని పెంచాలని ఏపీ సీఎం చంద్రబాబు చాలా రోజులుగా పిలుపునిస్తున్నారు. ఈ క్ర మంలోనే రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటును 1.5 శాతం నుంచి 2.1 శాతానికి పెంచేలా ప్రణా ళికలు రూపొందిస్తున్నామని, ప్రోత్సహకాలు అమలు చేస్తామని ఇటీవల ఆయన ప్రకటించా రు. ఈ క్రమంలోనే ఎన్ని కాన్పులైనా ఉద్యోగు లకు ప్రసూతి సెలవులు మంజూరు చేస్తామని ప్రకటించారు. అలాగే ఒక కుటుంబంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు చదువుకుంటున్నా అందరికీ తల్లికి వందనం పథకం వర్తింపజేస్తా మని తెలిపారు.

Tags:    

Similar News