AP: "ఏపీలో లాజిస్టిక్స్‌ కార్పొరేషన్‌"

Update: 2025-08-12 04:30 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­తో పాటు పొ­రు­గు రా­ష్ట్రాల సరకు రవా­ణా­ను ని­ర్వ­హిం­చేం­దు­కు లా­జి­స్టి­క్స్‌ కా­ర్పొ­రే­ష­న్‌ ఏర్పా­టు చే­యా­ల­ని అధి­కా­రు­ల­ను సీఎం చం­ద్ర­బా­బు ఆదే­శిం­చా­రు. ఓడ­రే­వు­లు, వి­మా­నా­శ్ర­యా­లు, రహ­దా­రు­లు, రైలు, అం­త­ర్గత జల రవా­ణా మా­ర్గాల ద్వా­రా చే­ప­ట్టే సరకు రవా­ణా­ను ఈ కా­ర్పొ­రే­ష­న్‌ ద్వా­రా­నే ని­ర్వ­హిం­చా­ల­ని ది­శా­ని­ర్దే­శం చే­శా­రు. పరి­శ్ర­మ­లు, మౌ­లిక సదు­పా­యా­ల­పై సచి­వా­ల­యం­లో సీఎం ఉన్న­త­స్థా­యి సమీ­క్ష ని­ర్వ­హిం­చా­రు. రా­ష్ట్రం­లో­ని ఎయి­ర్‌­పో­ర్టు­లు, పో­ర్టుల అభి­వృ­ద్ధి, మా­రి­టైం పా­ల­సీ­లో తీ­సు­కు­రా­వా­ల్సిన మా­ర్పు­లు తది­తర అం­శా­ల­పై చం­ద్ర­బా­బు చర్చిం­చా­రు. ఏపీ­లో 20 పో­ర్టు­లు, మరి­న్ని ఎయి­ర్ పో­ర్టుల ని­ర్మా­ణా­ల­కు ప్ర­ణా­ళి­క­లు సి­ద్ధం చే­స్తు­న్న­ట్లు సీఎం తె­లి­పా­రు. ప్ర­తి పో­ర్టు, ఎయి­ర్ పో­ర్టుల సమీప ప్రాం­తా­ల­ను ఆర్థిక కేం­ద్రా­లు­గా అభి­వృ­ద్ధి చే­యా­ల­ని అధి­కా­రు­ల­కు ది­శా­ని­ర్దే­శం చే­శా­రు. ఓడ­రే­వు­లు, వి­మా­నా­శ్ర­యా­ల­కు అను­సం­ధా­నిం­చే­లా శా­టి­లై­ట్ టౌన్ షి­ప్‌­ల­ను అభి­వృ­ద్ధి చే­యా­ల­న్నా­రు.

Tags:    

Similar News