AP: ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలకు మహర్దశ
రూ.9,490 కోట్లతో 4 కీలక హైవేల విస్తరణ... 4 హైవేల విస్తరణకు డీపీఆర్ సిద్ధం... కేంద్ర ఆమోదం తర్వాత రోడ్ల విస్తరణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్ల అభివృద్ది, విస్తరణ, నూతన రహదారుల నిర్మాణం వంటి అంశాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో అధికారులు రాష్ట్రంలోని నాలుగు కీలక హైవేల విస్తరణకు డీపీఆర్ రెడీ చేసి కేంద్రానికి పంపారు. పెడన- విస్సన్నపేట- లక్ష్మీపురం, ఆకివీడు-దిగమర్రు, అమలాపురం-రావులపాలెం, ముద్దనూరు-కడప మధ్య 243.3 కి.మీ.ల విస్తరణకు అధికారులు సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు సిద్ధంచేసి జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ(మోర్త్)కు పంపారు. భూసేకరణ, సివిల్ పనులు తదితరాలన్నీ కలిపి ఈ ప్రాజెక్టులకు రూ.9,490 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. వచ్చే మార్చిలోపు అనుమతులు రానున్నట్లు తెలుస్తోంది. అనంతరం భూసేకరణ, టెండర్ల ప్రక్రియ మొదలవుతాయి. వచ్చే సంవత్సరం మార్చి నాటికి కేంద్రం దీన్ని ఆమోదిస్తుందని.. ఆ తర్వాత భూసేకరణ, టెండర్లకు ఆహ్వానం వంటి పనులు ప్రారంభం అవుతాయని భావిస్తున్నారు.
రవాణ సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెరుగైన రవాణా సౌకర్యాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు అవసరాల కోసం.. ఇప్పటికే ఉన్న రహదారులను విస్తరించడం.. పలు ప్రాంతాల్లో నూతన రోడ్లను నిర్మించడం.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల రోడ్లను జాతీయ రహదారులతో అనుసంధానించడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నాలుగు కీలక హైవేల విస్తరణకు ఆమోద ముద్ర వేసింది. రూ.9,490 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ నాలుగు కీలక హైవేలను విస్తరించేందుకు రంగం సిద్ధమయ్యింది. ఆ వివరాలు.. జాతీయ రహదారి-216హెచ్ ఉన్న రూట్ అనగా కృష్ణా జిల్లాలోని పెడన నుంచి తెలంగాణ సరిహద్దులోని లక్ష్మీపురం వరకు.. గుడివాడ, నూజివీడు, విస్సన్నపేట మీదుగా మొత్తం 118 కిలో మీటర్ల మేర రహదారిని విస్తరించనున్నారు. దీనికి సంబంధించి రూ.4,245 కోట్లతో డీపీఆర్ను రెడీ చేసి కేంద్రానికి పంపారు. ఈ హైవే విస్తరణలో భాగంగా పెడన-నూజివీడు బైపాస్ వరకు 4 వరుసలుగా, అక్కడి నుంచి లక్ష్మీపురం దాకా 2 వరుసలుగా రహదారిను విస్తరించనున్నారు. దీనికి సంబంధించి భూసేకరణకు కావాల్సిన మొత్తంతో పాటు ఇతర ఖర్చులు కాకుండా.. కేవలం సివిల్ పనులకు మాత్రమే రూ.2 వేల కోట్లను వెచ్చించనున్నారు. అలానే పామర్రు-ఆకివీడు వరకు ఇప్పటికే 60 కిలో మీటర్ల రహదారి విస్తరణ సాగుతున్నాయి.
త్వరలోనే ఈ హైవేల విస్తరణ షురూ..
కృష్ణా జిల్లాలోని పెడన నుంచి గుడివాడ, నూజివీడు, విస్సన్నపేట మీదుగా తెలంగాణ సరిహద్దులోని లక్ష్మీపురం వరకు జాతీయ రహదారి-216హెచ్ను 118 కి.మీ. మేర విస్తరించనున్నారు. రూ.4,245 కోట్లతో డీపీఆర్ను సిద్ధంచేసి పంపారు. పెడన నుంచి నూజివీడు బైపాస్ వరకు 4 వరుసలుగా, అక్కడి నుంచి లక్ష్మీపురం దాకా రెండు వరుసలుగా విస్తరించనున్నారు. భూసేకరణ వ్యయం, ఇతర ఖర్చులు కాకుండా సివిల్ పనులకు రూ.2 వేల కోట్లను వెచ్చించనున్నారు. పామర్రు నుంచి ఆకివీడు వరకు 60 కి.మీ. మేర ఇప్పటికే విస్తరణ పనులు సాగుతున్నాయి. 45 కి.మీ. రెండు వరుసలుగా, 15 కి.మీ. నాలుగు వరుసలుగా విస్తరిస్తున్నారు. ఇప్పుడు ఆకివీడు నుంచి భీమవరం మీదుగా దిగమర్రు వరకు 44.94 కి.మీ. విస్తరణకు డీపీఆర్ పంపారు. ఇందులో 40 కి.మీ. 4 వరుసలు, మిగిలినది 2 వరుసలుగా విస్తరించేందుకు రూ.3,256 కోట్లతో అంచనాలు వేశారు. వాస్తవానికి పామర్రు నుంచి దిగమర్రు వరకు (ఎన్హెచ్-165) మొత్తం ప్రాజెక్టు విస్తరణ గతంలో మంజూరైంది.