Andhra Pradesh: అయ్యో పాపం.. అవతార్ సినిమా చూస్తూ ఆగిన గుండె..
Andhra Pradesh: సినిమాలో దృశ్యాలు కొన్ని గుండెలు తట్టుకోలేకపోతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి అవతార్ సినిమా చూస్తూ కుప్పకూలిపోయాడు.;
Andhra Pradesh: సినిమాలో దృశ్యాలు కొన్ని గుండెలు తట్టుకోలేకపోతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి అవతార్ సినిమా చూస్తూ కుప్పకూలిపోయాడు. అందరూ చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు.
జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన అవతార్: ది వే ఆఫ్ వాటర్ భారతదేశంలో విడుదలై సంచలనం సృష్టిస్తోంది. మొదటి రోజున రూ. 38 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇటీవల విడుదలైన సినిమా చూస్తున్నప్పుడు గుండెపోటుతో ఒక వ్యక్తి మరణించిన సంఘటన ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. బాధితుడు – లక్ష్మీరెడ్డి శ్రీను – తన సోదరుడు రాజుతో కలిసి పెద్దాపురంలోని సినిమా థియేటర్కి సినిమా చూడటానికి వెళ్లాడు.
సినిమా మధ్యలో శ్రీను కుప్పకూలిపోయాడు. దీంతో అతని సోదరుడు రాజు వెంటనే పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంతకుముందు 2010లో తైవాన్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 'అవతార్' సినిమా మొదటి భాగాన్ని చూస్తున్న 42 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మరణించాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.
వైద్యుల ప్రకారం, ఆ వ్యక్తికి అధిక రక్తపోటు చరిత్ర ఉంది. "సినిమా చూడటం ద్వారా అధిక ఉత్సాహం" కలిగింది. అదే గుండె ఆగిపోవడానికి కారణమైంది అని నిర్ధారించారు. ఏదైనా అతి అనర్థమే అని డాక్టర్లు వివరిస్తున్నారు.