AP: ఆంధ్రప్రదేశ్లో భారీగా ఉద్యోగాల భర్తీ
నిరుద్యోగ సమస్యలకు చెక్ పెట్టేందుకు చర్యలు.. తీవ్రంగా కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం.. ఉద్యోగాల భర్తీకి నారా లోకేశ్ ప్రత్యేక చర్యలు.. ప్రైవేట్ కంపెనీలతోనూ విస్తృత చర్చలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏపీని అన్ని విధాలుగా ప్రగతి పథంలో ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే నిరుద్యోగుల విషయంలో కూడా ఉద్యోగాలు, ఉపాధి కల్పన పైన పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తుంది. గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014లో స్వల్ప సంఖ్యలో ఖాళీలను భర్తీ చేసింది. ఆ తర్వాత వైసిపి హయాంలో ఖాళీలు భర్తీ చేస్తారని భావించిన ఐదేళ్లపాటు అది జరగలేదు. గత ఐదేళ్లలో పలువురికి పదోన్నతులు రావడం, పలువురు రిటైర్ కావడం తో చాలా పోస్టులు ఖాళీ అయ్యాయి. వివిధ క్యాడర్ లలో 40 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఈ సమస్యను ఉద్యోగ సంఘాలు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లగా, కూటమి సర్కార్ ఈ ఖాళీలను భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఇప్పటివరకు పదోన్నతులు వచ్చిన వారు పదోన్నతి తో పాటు , తాము గతంలో నిర్వహించిన బాధ్యతను కూడా అదనంగా నిర్వహించాల్సి వస్తుంది. రెండు పోస్టుల విధులతో వారిపైన పని ఒత్తిడి పెరిగింది.
ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలు
రాజధాని అమరావతిలో ఏర్పాటుచేసే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ దక్షిణాసియాలోనే మొదటిదని ఐటీ, విద్య, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఇందులో ఐదేళ్లలో లక్ష మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. 50కి పైగా యూనికార్న్లు అభివృద్ధి చేస్తామన్నారు. ఈ వ్యాలీ చంద్రబాబు సాంకేతిక విప్లవంలో సెకండ్ చాప్టర్గా పేర్కొన్నారు. సోమవారం విజయవాడలో క్వాంటమ్ వ్యాలీ వర్క్షా్పలో ఆయన మాట్లాడారు. వచ్చే జనవరి 1న ప్రారంభించే ఈ క్వాంటమ్ వ్యాలీకి అనుబంధంగా.. ఆలోచనలను ఆవిష్కరణలుగా.. ఆవిష్కరణలను పరిశ్రమలుగా మార్చే ఎకో సిస్టమ్ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇది ఒకరోజు కార్యక్రమం కాదని.. నిరంతర కొనసాగుతుందని.. దీనికి అమరావతి కేంద్ర బిందువుగా ఉంటుందని అన్నారు. క్యూబిక్ ఆర్కిటెక్చర్ నుంచి క్రయోఎలకా్ట్రనిక్స్ వరకూ.. అల్గారిథం అభివృద్ధి నుంచి క్వాంటమ్ సామర్థ్యాన్ని అభివ్దృద్ధి చేస్తామని వెల్లడించారు. దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్-2 త్వరలోనే అమరావతిలో అందుబాటులోకి వస్తుందని, ఇది చాలా గర్వించదగ్గ విషయమని చెప్పారు.
కూటమి సర్కార్ కీలక చర్యలు
\రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటి పోతున్నా నిరుద్యోగ సమస్య అనుకున్న మేర తగ్గడం లేదు. 2014-19లో కొంత మేర సమస్యను పరిష్కరించినప్పటికీ.. 2019-2024 వరకు ఈ సమస్య మరింత పెరిగింది. ఉద్యోగాలు లేక యువతీ, యువకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదో ఒక పని చేసుకునేందుకు ఇతర దేశాలు, రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. చదువుకు తగ్గ ఉద్యోగం దొరకకపోయినా ఏదో ఒక పని చేసుకుంటూ కష్టాలుపడుతూ అక్కడే పోతున్నారు. ఇలాంటి పరిస్థితులు లేకుండా నిరుద్యోగ సమస్యను చక్కదిగ్గేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. మంత్రి నారా లోకేశ్ చొరవతో ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాల కోసం రాష్ట్రవ్యాప్తంగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి మెగా డీఎస్సీని నిర్వహించారు. అలాగే కానిస్టేబుల్ జాబులను భర్తీ చేశారు. అంతేకాకుండా పాలనలో ఎప్పటికప్పుడు ప్రత్యేకతను చాటు చాటుకుంటున్నారు. రేషనింగ్ విధానంలో కొత్త మార్పులు చేశారు. పేదలకు రేషన్ బియ్యం అందించేందుకు స్మార్డ్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చారు. విజిటింగ్ కార్డు మాదిరిగా కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన కార్డును అందజేస్తున్నారు. ఇందులో భాగంగా గుంటూరులో నిర్వహించిన స్మార్ట్ కార్డుల పంపిణీలో మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని ఉద్యోగాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ చొరవతో త్వరలో భారీగా ఉద్యోగాలు వస్తామని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ఒక్క కంపెనీ కూడా రాష్ట్రానికి రాలేదని గుర్తుచేశారు. రాష్ట్రానికి పెట్టుబడులపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందని, కంపెనీలను ఆహ్వానించిందని కేంద్రమంత్రి పెమ్మసాని తెలిపారు.
టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థలకు విశాఖలో ఇప్పటికే భూకేటాయింపులు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. ఆ సంస్థలు సాధ్యమైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఇటీవల తమ బెంగుళూరు పర్యటనలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు ఏఎన్ఎస్ఆర్, సత్వ సంస్థలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయని, ఈ రెండింటి ద్వారానే యువతకు 35 వేల ఉద్యోగాలు రానున్నాయని చెప్పారు. రాష్ట్రానికి వచ్చే చిన్న సంస్థల కోసం 26 జిల్లా కేంద్రాల్లో కో వర్కింగ్ స్పేస్లు సిద్ధం చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం చర్యలతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి.