AP: రాజధాని రైతుల సమస్యలు పరిష్కరిస్తాం

ఆరు నెలల్లో పరిష్కరిస్తామన్న కేంద్రమంత్రి పెమ్మసాని

Update: 2025-11-22 07:00 GMT

అమ­రా­వ­తి రా­జ­ధా­ని రై­తుల సమ­స్య­ల­ను ఆరు నె­ల­ల్లో పరి­ష్క­రి­స్తా­మ­ని కేం­ద్ర­మం­త్రి పె­మ్మ­సా­ని చం­ద్ర­శే­ఖ­ర్ తె­లి­పా­రు. రా­ష్ట్ర మం­త్రి నా­రా­యణ, తె­నా­లి ఎమ్మె­ల్యే శ్రా­వ­ణ్ కు­మా­ర్, సీ­ఆ­ర్డీఏ కమి­ష­న­ర్, అడి­ష­న­ల్ కమి­ష­న­ర్, రైతు జే­ఏ­సీ ప్ర­తి­ని­ధు­ల­తో కలి­సి ని­ర్వ­హిం­చిన త్రి­స­భ్య కమి­టీ సమా­వే­శా­ని­కి హా­జ­ర­య్యా­రు. అనం­త­రం ఏర్పా­టు చే­సిన వి­లే­క­రుల సమా­వే­శం­లో కేం­ద్ర­మం­త్రి మా­ట్లా­డు­తూ గత జగన్ ప్ర­భు­త్వ కా­ర­ణం­గా డె­వ­ల­ప్మెం­ట్ పను­లు ని­లి­చి­పో­యా­యి అన్నా­రు. సీఎం చం­ద్ర­బా­బు నా­యు­డు సూ­చ­నల మే­ర­కు రా­జ­ధా­ని రై­తుల సమ­స్య­ల­ను పరి­ష్క­రిం­చేం­దు­కు ప్ర­త్యేక కమి­టీ వే­య­డం జరి­గిం­ద­న్నా­రు. అయి­తే భూ­వి­వా­దాల కా­ర­ణం­గా పను­ల్లో జా­ప్యం ఏర్ప­డు­తుం­ద­న్నా­రు. కొం­ద­రు తమవి కాని భూ­ము­ల­ను తమ­వి­గా పే­ర్కొం­టూ సమ­స్య­ల­కు కా­ర­ణ­మ­వు­తు­న్నా­ర­న్నా­రు. వా­టి­ని పరి­ష్క­రిం­చేం­దు­కు ప్ర­త్యేక చర్య­లు చే­ప­డ­తా­మ­ని పె­మ్మ­సా­ని చం­ద్ర­శే­ఖ­ర్ వె­ల్ల­డిం­చా­రు.

అభివృద్ధికి 25 గ్రామాలు...

రాజధాని అమరావతి పరిధిలో 25 గ్రామాలను డెవలప్ చేసేందుకు ఐదు సంస్థలకు కాంట్రాక్టును ఇవ్వనున్నామన్నారు. ఆయా గ్రామాల్లో నీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వరద నీటి పైపులైన్లు, రోడ్లు, శానిటేషన్, వీధి దీపాల వంటి ఆధారంగా జరిపే డీపీఆర్ సమర్పించాలని ఆయా సంస్థలను ఆదేశించామన్నారు. డిసెంబర్ 15 నుంచి 30 లోపు ఫైనల్ డీపీఆర్ రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ప్రభుత్వం ఆమోదిస్తే వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పనులు ప్రారంభమవుతాయన్నారు. జూన్ నాటికి ఆరు నెలల్లో నిర్దేశిత పనులు పూర్తవుతాయని చెప్పుకొచ్చారు. ఎన్సీసీ సంస్థకు 4, ఆర్వీఆర్ కు 3, మేఘాకు 13, బీఎస్ఆర్ కు 5, ఎల్ అండ్ టీకి 5 గ్రామాలను కేటాయించడం జరిగిందని వెల్లడించారు.

Tags:    

Similar News