athome: ఘనంగా తెలుగు రాష్ట్రాల్లో "ఎట్‌హోం"

Update: 2025-08-16 03:30 GMT

వి­జ­య­వా­డ­లో ఏపీ రా­జ్‌­భ­వ­న్‌­లో స్వా­తం­త్య్ర ది­నో­త్స­వం సం­ద­ర్భం­గా ఎట్‌ హోం కా­ర్య­క్ర­మం ఘనం­గా జరి­గిం­ది. గవ­ర్న­ర్ జస్టి­స్ అబ్దు­ల్ నజీ­ర్ తే­నీ­టి విం­దు ఇచ్చా­రు. ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు, ఆయన సతీ­మ­ణి భు­వ­నే­శ్వ­రి, ఉప­ము­ఖ్య­మం­త్రి పవన్ కల్యా­ణ్, రా­ష్ట్ర హై­కో­ర్టు న్యా­య­మూ­ర్తు­లు, మం­త్రు­లు, ఎం­పీ­లు, ఎమ్మె­ల్యే­లు, సీ­ని­య­ర్ అధి­కా­రు­లు, ‘పద్మ’ అవా­ర్డు గ్ర­హీ­త­లు, వి­విధ రం­గాల ప్ర­ము­ఖు­లు కా­ర్య­క్ర­మం­లో పా­ల్గొ­న్నా­రు. వి­జ­య­వాడ ము­న్సి­ప­ల్ స్టే­డి­యం­లో 79వ స్వా­తం­త్ర్య వే­డు­క­ల­ను ఘనం­గా ని­ర్వ­హిం­చా­రు. ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు జా­తీ­య­జెం­డా­ను ఆవి­ష్క­రిం­చా­రు.


మరో­వై­పు తె­లం­గాణ రా­జ్‌­భ­వ­న్‌­లో ఎట్‌­హోం కా­ర్య­క్ర­మం జరి­గిం­ది. గవ­ర్న­ర్‌ జి­ష్ణు­దే­వ్‌ వర్మ ఇచ్చిన తే­నీ­టి విం­దు­కు సీఎం రే­వం­త్‌­రె­డ్డి, డి­ప్యూ­టీ సీఎం మల్లు భట్టి వి­క్ర­మా­ర్క­తో పాటు పలు­వు­రు మం­త్రు­లు, ఇతర ప్ర­జా­ప్ర­తి­ని­ధు­లు, వి­విధ పా­ర్టీల నే­త­లు, వి­విధ రం­గా­ల­కు చెం­దిన ప్ర­ము­ఖు­లు హా­జ­ర­య్యా­రు. కా­ర్య­క్ర­మా­ని­కి హా­జ­రైన వారి వద్ద­కు గవ­ర్న­ర్‌, సీఎం వె­ళ్లి పల­క­రిం­చా­రు. 79వ స్వా­తం­త్ర్య ది­నో­త్స­వం సం­ద­ర్భం­గా గో­ల్కొండ కో­ట­లో జా­తీ­య­ప­తా­కా­న్ని ము­ఖ్య­మం­త్రి ఆవి­ష్క­రిం­చా­రు.

Tags:    

Similar News