KANAPPA: మంచు విష్ణు ఆఫీసులో జీఎస్టీ సోదాలు
విడుదల సమీపించిన వేళ కన్నప్ప టీంకు భారీ షాక్;
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' విడుదలకు మరో రెండు రోజులు ఉందనగా.. చిత్ర బృందానికి భారీ షాక్ తగిలింది. 'కన్నప్ప' టీమ్ పై జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంచు విష్ణుతో సహా పలువురి ప్రముఖుల ఇళ్లల్లో సోదాలు జరిగాయి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను అధికారులు తనిఖీ చేశారు. నిబంధనల ప్రకారం జీఎస్టీ కట్టారా, లేదా? అనే విషయాలను ఆరా తీసినట్టు సమాచారం. అలాగే 'కన్నప్ప' బడ్జెట్ పై కూడా ఆదాయపన్ను శాఖ అధికారులు వివరాలు అడిగినట్లు వెల్లడించింది. కన్నప్ప విడుదల నేపథ్యంలో జీఎస్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే జీఎస్టీ తనిఖీల గురించి తనకు ఏమీ తెలియదు అంటున్నారు మంచు విష్ణు. మేం దాచిపెట్టడానికి ఏమీ లేదు, మేం ఎక్కడెక్కడ అప్పులు చేశామో వారికి తెలుస్తుంది అని మంచు విష్ణు అన్నారు.
బడ్డెట్ సహా చాలా వివరాలపై ఆరా
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప.. ఈ నెల 27న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. విడుదల దగ్గర పడటంతో సినిమా యూనిట్ ప్రమోషన్స్ కూడా వేగవంతం చేశారు. ఈ క్రమంలో తాజాగా కన్నప్ప టీమ్ కు షాక్ తగిలింది. కన్నప్ప సినిమా బడ్జెట్ వివరాలపై GST అధికారుల ఆరా తీస్తున్నారు అధికారులు. కాగా కన్నప్ప సినిమాను మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ఎక్కువ శాతం విదేశాల్లో చిత్రీకరించారు. అలాగే వీఎఫ్ ఎక్స్ కోసం భారీగానే ఖర్చు పెట్టారు. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా భారీగానే నిర్వహించారు. సినిమా బడ్జెట్ కు సంబంధించిన ఖర్చులు, బ్యాలన్ షీట్లను పరిశీలిస్తున్నారు. ఏ ఏ అకౌంట్ల నుంచి నిధులు ట్రాన్స్ ఫర్ అయ్యాయి.. ట్యాక్స్, జీఎస్టీ ఎంత వరకు చెల్లించారనే కోణంలో సోదాలు జరుపుతున్నారు. విషయం తెలుసుకున్న మోహన్ బాబు హుటాహుటిన విష్ణు ఆఫీస్ కు వచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఐటీ, జీఎస్టీ రైడ్స్ గురించి తనకు తెలియదని.. సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నట్లు మంచు విష్ణు తెలిపారు. తాజాగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా నిర్వహించారు. సరిగ్గా రిలీజ్ కు ముందు సోదాలు నిర్వహించడం సినిమా యూనిట్, అభిమానుల్లో ఆందోళన కలిగించే అంశం.