BJP: బీజేపీకి తొలి మహిళా అధ్యక్షురాలు

తుది దశకు బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నిక, 16 రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షుల నియామకం పూర్తి... అధ్యక్ష ఎన్నికకు ముందు 19 రాష్ట్రాల్లో ప్రక్రియ;

Update: 2025-07-05 04:30 GMT

భా­ర­తీయ జనతా పా­ర్టీ­లో జా­తీయ అధ్య­క్ష ఎన్ని­కల ప్ర­క్రియ తుది దశకు చే­రిం­ది. ప్ర­స్తు­తం 16 రా­ష్ట్రా­ల్లో ఇప్ప­టి­కే కొ­త్త పా­ర్టీ అధ్య­క్షుల ని­యా­మ­కం పూ­ర్త­వ్వ­గా, మరి­కొ­న్ని రా­ష్ట్రా­ల్లో ప్ర­క్రియ కొ­న­సా­గు­తోం­ది. మొ­త్తం 19 రా­ష్ట్రా­ల్లో కొ­త్త అధ్య­క్షు­లు ని­య­మి­తు­లైన తర్వా­తే జా­తీయ అధ్య­క్షు­డి ఎన్నిక జర­గ­నుం­ది. అయి­తే ఈసా­రి బీ­జే­పీ గట్టి సి­గ్న­ల్ ఇవ్వ­నుం­ద­న్న రా­జ­కీయ వర్గా­ల్లో జో­రు­గా వి­ని­పి­స్తోం­ది. ఆ పదవి ఒక మహి­ళా నే­త­కే దక్కే అవ­కా­శా­లు ఎక్కు­వ­గా ఉన్నా­య­న్న ఊహా­గా­నా­లు జో­రం­దు­కుం­టు­న్నా­యి.

మహిళా నేతల పేర్లు హాట్‌ ఫేవరెట్‌గా!

బీజేపీ నేతృత్వం ఈసారి మహిళలకు పెద్దపీట వేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌, దగ్గుబాటి పురందేశ్వరి, మహిళా మోర్చా చీఫ్ వానతీ శ్రీనివాసన్‌ ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

నిర్మలా సీతారామన్

నిర్మలా సీతారామన్ పేరే ప్రస్తుతం అధిష్ఠానం లోనూ, పార్టీ వర్గాల్లోనూ ప్రాధాన్యతగా వినిపిస్తోంది. 2019 నుండి ఆర్థిక మంత్రి హోదాలో దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పే బాధ్యతను నిర్వర్తిస్తూ వస్తున్నారు. మోదీ కేబినెట్‌లో నెంబర్ వన్ మహిళా నాయకురాలిగా, అంతర్జాతీయ వేదికలపై తన ఆధిపత్యాన్ని చాటారు. ఇటీవల నడ్డా, బీఎల్ సంతోష్‌లను ఆమె భేటీ అయిన వార్తలు ఈ ఊహాగానాలకు బలాన్నిస్తున్నాయి.

పురందేశ్వరి

ఏపీ బీ­జే­పీ­లో పు­నా­దు­ల­ను బలో­పే­తం చే­సిన దగ్గు­బా­టి పు­రం­దే­శ్వ­రి, ఇప్పు­డు జా­తీయ స్థా­యి­లో తన ప్ర­భా­వా­న్ని చూపే ప్ర­య­త్నా­ల్లో ఉన్నా­రు. వి­దే­శీ పర్య­ట­న­లు, ఉగ్ర­వా­దం­పై భా­ర­త్ వై­ఖ­రి­ని చాటి చె­ప్ప­డం వంటి అం­శా­లు ఆమె­కు డి­ప్లొ­మా­టి­క్ ఫ్లె­వ­ర్‌­ను కలి­గిం­చా­యి. కాం­గ్రె­స్ మూ­లాల నుం­చి వచ్చి­న­ప్ప­టి­కీ, బీ­జే­పీ­లో పూ­ర్తి­గా కలి­సి­పో­యా­రు. కేం­ద్రం ఏర్పా­టు­చే­సిన 7 అఖి­ల­ప­క్ష బృం­దా­ల్లో­ని ఓ బృం­దా­ని­కి పు­రం­దే­శ్వ­రి ప్రా­తి­ని­ధ్యం వహిం­చా­రు. ఫ్రా­న్స్, యూకే, ఈయూ, ఇటలీ, డె­న్మా­ర్క్, జర్మ­నీ దే­శా­ల్లో పర్య­టిం­చిన ఆమె బృం­దం ఉగ్ర­వా­దం­పై భా­ర­త్‌ వై­ఖ­రి­ని ప్ర­పంచ దే­శా­ల­కు స్ప­ష్టం­ చే­సిం­ది.

వానతీ శ్రీనివాసన్

వానతీ శ్రీనివాసన్ పేరులో కొత్తదనముంది. తమిళనాడులో బీజేపీ బలహీనంగా ఉన్నప్పటికీ, కోయంబత్తూర్‌ (దక్షిణ) నియోజకవర్గాన్ని MNM అధినేత కమల్ హాసన్‌పై గెలవడం పార్టీకి విశ్వాసాన్ని ఇచ్చింది. 2022లో కేంద్ర ఎన్నికల కమిటీలోకి చేర్చడం, మహిళా మోర్చా నాయకురాలిగా ఆమె నిర్వహించిన కార్యక్రమాలు ఆమెను జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా చేశాయి.

రెండు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి

మహి­ళా శక్తి­కి గౌ­ర­వం: బీ­జే­పీ దశా­బ్దాల చరి­త్ర­లో ఇప్ప­టి వరకు మహి­ళా జా­తీయ అధ్య­క్షు­రా­లు లేరు. మోదీ-షా జంట ఈసా­రి ఆ చరి­త్ర­ను మా­ర్చే ది­శ­గా అడు­గు­లు వే­య­డం వి­శే­షం. దక్షిణ భారత ప్రా­ధా­న్యం: వా­న­తీ, పు­రం­దే­శ్వ­రి, ని­ర్మ­ల­మ్మ ము­గ్గు­రూ దక్షి­ణా­ది రా­ష్ట్రాల నే­త­లే. భా­జ­పా దక్షి­ణా­ది­లో పట్టు సా­ధిం­చ­లే­ని నే­ప­థ్యం­లో, అక్క­డి­వా­రి­కి అధి­ప­త్యం ఇవ్వ­డం వ్యూ­హా­త్మ­కం­గా చూ­డ­వ­చ్చు.

Tags:    

Similar News