Brother Anil : సమయం వచ్చినప్పుడు ఏపీలో పార్టీపై స్పష్టత ఇస్తా : బ్రదర్ అనిల్

Brother Anil : విశాఖలో... క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులతోపాటు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన బీసీ, ఎస్సీ, మైనార్టీ నేతలు, మేధావులు చర్చలు జరిపారు బ్రదర్‌ అనిల్‌ కుమార్‌.

Update: 2022-03-14 11:02 GMT

Brother Anil : విశాఖలో... క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులతోపాటు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన బీసీ, ఎస్సీ, మైనార్టీ నేతలు, మేధావులు చర్చలు జరిపారు బ్రదర్‌ అనిల్‌ కుమార్‌. ఏపీలో పార్టీ పెడాతారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఎన్నికల ముందు...తన బావను గెలిపించాలని తాను బీఎసీ,ఎస్సీ, మైనార్టీల సహాయం అడిగినట్లు తెలిపారు.

రాజకీయాల్లో ఇన్వాల్వ్‌ కాకపోయినా.. తన మాట మీద గౌరవంతో.. వారంతా సహకరించారన్నారు. ప్రజలు ఉద్యోగం ఇచ్చారని, ఆ బాధ్యతను నెరవేర్చితే బాగానే ఉంటుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బ్రదర్‌ అనిల్‌. జగన్‌ను కలిసి రెండున్నరేళ్లయిందని..ఆయన ఇప్పుడు చాలా బిజీ అయిపోయారన్నారు బ్రదర్‌ అనిల్‌. ఆయన్ను కలిసి బీసీ, ఎస్సీ, మైనార్టీల సమస్యల్ని వివరిస్తామన్నారు.

జగన్‌ను కలవాలంటే... తనకు అపాయింట్‌మెంట్ అవసరం లేదని, అయితే.. ఓ పద్దతి ప్రకారం చేయాలి కాబట్టి చేస్తున్నట్లు తెలిపారు. జగన్‌ పాలనలో ఏమి కోల్పోయారో బీసీ, ఎస్సీ, మైనార్టీ ప్రతినిధులు బాధలు ఇబ్బందులు చెప్పుకున్నట్లు తెలిపారు అనిల్‌.ఇష్యూ బేస్డ్‌గా అందరితో చర్చిస్తున్నట్లు తెలిపారు. అందరి బాధలు విని నిర్ణయం తీసుకుంటామన్నారాయన. పార్టీపై సమయం వచ్చినప్పుడు స్పష్టత ఇస్తానన్నారు.

పార్టీ పెట్టాలని అన్నిసంఘాల నుంచి ప్రతిపాదనలు వస్తున్నట్లు తెలిపారు. పార్టీ పెట్టడం ఆషామాషీ కాదన్నారు. బీసీ అభ్యర్ధిని ముఖ్యమంత్రి చేసే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. వివేక హత్య కేసుపైనా స్పందించారు అనిల్‌. హంతకులు ఎవరైనా జైలుకు వెళ్లక తప్పదన్నారు అనిల్‌.

Tags:    

Similar News