వివేకా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. సీబీఐ దర్యాప్తు డెడ్లైన్ ఇవాల్టితో ముగియడంతో ఎంపీ అవినాశ్ పై ఛార్జ్ షీట్ ఫైల్ చేసేందుకు సమాయత్తం అయింది. జూన్ 30లోపు విచారణ ముగించాలని గతంలో సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తునకు సంబంధించి ఇవాళ సుప్రీంకోర్టులో సీబీఐ స్టేటస్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. తొలుత దర్యాప్తు పూర్తి చేయడానికి మరికొంత సమయం కోరాలని సీబీఐ భావించినప్పటికీ చివరి ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకే నిర్ణయించుకుంది.