CBN: చంద్రబాబు కీలక పిలుపు
అటల్ సందేశ్-మోదీ సుపరిపాలన యాత్రలో పాల్గొనాలని పిలుపు
ఏపీలో డిసెంబర్ 11 నుంచి 25 వరకు నిర్వహించే అటల్ సందేశ్-మోదీ సుపరిపాలన యాత్రలో ఎన్డీఏ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. టెలీ కాన్ఫరెన్స్ లో సీఎం మాట్లాడుతూ వాజ్ పేయి స్ఫూర్తిని యువతలో నింపేలా ఈ యాత్రను బీజేపీ తలపెట్టిందన్నారు. దేశంలో సుపరిపాలనకు నాంది పలికిన నాయకులు వాజ్ పేయీ అన్నారు. తనకు వాజ్ పేయీతో మంచి అనుబంధం ఉండేదన్నారు. వాజ్పేయ్తో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని కూడా చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. "రాష్ట్రాభివృద్ధి కోసం ఏది అడిగినా కాదనేవారు కాదు. విధానపరమైన నిర్ణయాలు వేగంగా తీసుకునేవారు" అని తెలిపారు. సుపరిపాలన విషయంలో ఎన్టీఆర్, వాజ్పేయ్ ఇద్దరూ ఒకేలా ఉండేవారని, వారి వ్యక్తిత్వాలు విశిష్టమైనవని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా వాజ్పేయ్ స్ఫూర్తితోనే దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని చంద్రబాబు అన్నారు. 2047 నాటికి భారత్ను ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలపాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారని, యువతకు ఆయన స్ఫూర్తిగా నిలుస్తున్నారని తెలిపారు.
నాడు అణు పరీక్షలు అయినా, నేడు ఆపరేషన్ సింధూర్ అయినా, నాడు చతుర్భుజి అయినా, నేడు సాగరమాల అయినా అవి ఎన్డీయే పాలనలో విజయవంతమైన కార్యక్రమాలని సీఎం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా దేశాన్ని 2047కు నెంబర్ వన్ చేసేందుకు పని చేస్తున్నారని వెల్లడించారు. 2047 నాటికి ఇండియా, ఇండియన్స్ నెంబర్ స్థానానికి వెళ్తారని జ్యోష్యం చెప్పారు. యువతరానికి మోదీ ఒక స్ఫూర్తినిస్తున్నారన్నారు. వాజ్పేయ్ శతజయంతి కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.