CBN: ప్రధాని మోదీ సమక్షంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

కర్నూ­లు­లో త్వ­ర­లో­నే హై­కో­ర్టు బెం­చ్ ఏర్పా­టు

Update: 2025-10-16 15:30 GMT

కర్నూ­లు, కడప ప్ర­జ­ల­కు సీఎం చం­ద్ర­బా­బు శు­భ­వా­ర్త తె­లి­పా­రు. ప్ర­ధా­ని మోడీ సమ­క్షం­లో­నే ఆయన కీలక వ్యా­ఖ్య­లు చే­శా­రు. కర్నూ­లు­లో ని­ర్వ­హిం­చిన జీ­ఎ­స్టీ బహి­రంగ సభలో ప్ర­ధా­ని మోడీ, డి­ప్యూ­టీ సీఎం పవన్ కల్యా­ణ్‌­తో చం­ద్ర­బా­బు కలి­సి పా­ల్గొ­న్నా­రు. ఈ సం­ద­ర్భం­గా చం­ద్ర­బా­బు మా­ట్లా­డు­తూ కర్నూ­లు­లో త్వ­ర­లో­నే హై­కో­ర్టు బెం­చ్ ఏర్పా­టు చే­స్తా­మ­ని హామీ ఇచ్చా­రు. కడ­ప­లో స్టీ­ల్ ప్లాం­ట్, స్పే­స్ సి­టీ­ని ఏర్పా­టు చే­స్తా­మ­న్నా­రు. ఓర్వ­క­ల్లు­లో డ్రో­న్ సిటీ, రా­య­ల­సీ­మ­లో గ్రీ­న్ ఎన­ర్జీ ప్రా­జె­క్టు­లు ఏర్పా­టు చే­స్తా­మ­ని తె­లి­పా­రు. రా­య­ల­సీ­మ­కు సి­మెం­ట్ ఫ్యా­క్ట­రీ­లు వస్తు­న్నా­య­ని చం­ద్ర­బా­బు చె­ప్పా­రు.

రాబోయే రోజుల్లో మరిన్ని...

మన అం­ద­రి భవి­ష్య­త్తు కా­పా­డే నా­య­కు­డు ప్ర­ధా­న­మం­త్రి నరేం­ద్ర­మో­దీ అని చం­ద్ర­బా­బు అన్నా­రు. జీ­ఎ­స్టీ సం­స్క­ర­ణ­ల­తో ప్ర­జ­లం­ద­రూ లాభం పొం­దా­ర­న్నా­రు. ‘‘సూ­ప­ర్‌ సే­విం­గ్స్‌ ప్రా­రం­భం మా­త్ర­మే.. రా­బో­యే రో­జు­ల్లో మరి­న్ని ఉం­టా­యి. 25 ఏళ్లు­గా ప్ర­జా సే­వ­లో సీ­ఎం­గా, ప్ర­ధా­ని­గా మోదీ ఉన్నా­రు. 21వ శతా­బ్దం మో­దీ­కి చెం­దు­తుం­ద­న­డం­లో సం­దే­హం లేదు. సరైన సమ­యం­లో దే­శా­ని­కి సరైన నా­య­కు­డు ప్ర­ధా­ని మోదీ. అలాం­టి నా­య­కు­డి­ని పొం­ద­డం.. దేశం ఎంతో అదృ­ష్టం చే­సు­కుం­ది. చాలా మంది ప్ర­ధా­ను­ల­తో పని­చే­సి­నా.. మోదీ వంటి నా­య­కు­డి­ని చూ­డ­లే­దు. ఎలాం­టి వి­శ్రాం­తి లే­కుం­డా ని­రం­త­రం పని­చే­స్తూ­నే ఉన్నా­రు. 2047 నా­టి­కి ప్ర­పం­చం­లో భా­ర­త్‌ అగ్ర­స్థా­నం­లో ని­లు­స్తుం­ది. మోదీ సం­క­ల్పం­తో 11వ స్థా­నం నుం­చి నా­లు­గో స్థా­నా­ని­కి చే­రాం. ఆప­రే­ష­న్‌ సిం­దూ­ర్‌.. మన సై­నిక బలం ని­రూ­పిం­చిం­ది. మా­ట­ల­తో కాదు.. చే­త­ల­తో చూ­పిం­చే వ్య­క్తి ప్ర­ధా­ని మోదీ.” అని అన్నా­రు. ‘‘సరైన సమ­యం­లో సరైన చోట సరైన వ్య­క్తి­గా ప్ర­ధా­ని మోడీ ఓ వి­శి­ష్ట­మైన వ్య­క్తి.. 21వ శతా­బ్ద­పు నేత. ఎం­ద­రో ప్ర­ధా­న­మం­త్రు­ల­తో కలి­సి పని చే­సి­నా మోదీ లాం­టి వ్య­క్తి­ని చూ­డ­లే­దు.” అని చం­ద్ర­బా­బు అన్నా­రు.

ప్రధాని కర్మయోగి: పవన్

ఎలాం­టి ఫలి­తా­లు ఆశిం­చ­కుం­డా కే­వ­లం దేశ సేవే పర­మా­వ­ధి­గా పని చే­స్తు­న్న ప్ర­ధాన నరేం­ద్ర మో­డీ­ని మనం కర్మ­యో­గి­గా చూ­స్తు­న్నా­మ­ని డి­ప్యూ­టీ సీఎం పవ­న్‌ కల్యా­ణ్‌ అన్నా­రు. ‘సూ­ప­ర్‌ జీ­ఎ­స్టీ.. సూ­ప­ర్ సే­విం­గ్స్‌’ బహి­రంగ ఆయన పా­ల్గొ­న్నా­రు. ఈ సం­ద­ర్భం­గా పవన్ మా­ట్లా­డు­తూ.. మోదీ దే­శా­న్ని మా­త్ర­మే కా­ద­ని, రెం­డు తరా­ల­ను నడు­పు­తు­న్నా­ర­ని తె­లి­పా­రు. ప్ర­పం­చ­మం­తా దేశం వైపు తలె­త్తి చూసే వి­ధం­గా ఆత్మ­ని­ర్భ­ర్‌ భా­ర­త్‌ తీ­సు­కొ­చ్చా­ర­ని కొ­ని­యా­డా­రు. ఒక తరం కోసం ఆలో­చిం­చే నా­య­కు­డు చం­ద్ర­బా­బు అంటూ ప్ర­శం­సిం­చా­రు. కూ­ట­మి 15 ఏళ్ల­కు తక్కువ కా­కుం­డా బలం­గా ఉం­డా­ల­ని ఆయన ఆకాం­క్షిం­చా­రు. ఈ కా­ర్య­క్ర­మా­ని­కి ప్ర­ధా­ని మో­దీ­తో పాటు సీఎం చం­ద్ర­బా­బు, మం­త్రి నారా లో­కే­శ్‌ సహా పలు­వు­రు మం­త్రు­లు, ప్ర­ము­ఖు­లు హా­జ­ర­య్యా­రు. రా­ష్ట్ర వ్యా­ప్తం­గా పలు­చో­ట్ల ని­ర్మిం­చిన, ని­ర్మిం­చ­బో­తు­న్న రూ.13,429 కో­ట్ల వి­లు­వైన ప్రా­జె­క్టు­ల­కు ప్ర­ధా­ని వర్చు­వ­ల్‌­గా ప్రా­రం­భో­త్స­వా­లు, శం­కు­స్థా­ప­న­లు చే­శా­రు.

Tags:    

Similar News