cbn: కూటమి పాలనలో పేదలకు నివాస యోగ్యం

కూటమి పాలనలో పేదలకు నివాస యోగ్యం... హామీల అమలు దిశగా కూటమి సర్కార్... మరో హామీ అమలు దిశగా ప్రభుత్వం చర్యలు;

Update: 2025-07-21 05:30 GMT

ఏపీ­లో­ని ని­రు­పే­ద­ల­కు శు­భ­వా­ర్త.. మరో హామీ అమ­లు­కు ఏపీ ప్ర­భు­త్వం సి­ద్ధ­మైం­ది. ఎన్ని­కల సమ­యం­లో ని­రు­పే­ద­ల­కు పట్ట­ణా­ల్లో రెం­డు సెం­ట్లు, గ్రా­మా­ల­లో మూడు సెం­ట్లు చొ­ప్పున ఇళ్ల స్థ­లా­లు మం­జూ­రు చే­స్తా­మ­ని టీ­డీ­పీ కూ­ట­మి హామీ ఇచ్చిన సం­గ­తి తె­లి­సిం­దే. హామీ అమ­లు­కు ప్ర­భు­త్వం కస­ర­త్తు చే­స్తోం­ది. ఈ క్ర­మం­లో­నే ఇప్ప­టి­కే గ్రా­మా­ల్లో ఇళ్ల స్థ­లాల కోసం దర­ఖా­స్తుల స్వీ­క­రణ ఆఫ్‌­లై­న్ పద్ధ­తి­లో జరు­గు­తోం­ది. శని­వా­రం నుం­చి ఆన్‌­లై­న్ వి­ధా­నం­లో దర­ఖా­స్తు చే­సు­కు­నేం­దు­కు అవ­కా­శం కల్పిం­చి­న­ట్లు అధి­కా­రు­లు చె­ప్తు­న్నా­రు.

పట్టాల పంపిణీపై ప్రత్యేక దృష్టి

ఇళ్లు లేని పే­ద­ల­కు పట్టాల పం­పి­ణీ­పై కూ­ట­మి ప్ర­భు­త్వం ప్ర­త్యేక దృ­ష్టి­సా­రిం­చిం­ది. పట్ట­ణా­ల్లో రెం­డు సెం­ట్లు, గ్రా­మీణ ప్రాం­తా­ల్లో మూడు సెం­ట్ల చొ­ప్పున ఇవ్వా­ల­ని ని­ర్ణ­యిం­చిం­ది. ఈ మే­ర­కు జి­ల్లా­ల్లో లబ్ధి­దా­రు­లు, ఇంటి స్థ­లాల గు­ర్తిం­పు ప్ర­క్రియ సమాం­త­రం­గా కొ­న­సా­గు­తోం­ది. తొలి విడత కింద ఎం­పి­కైన అర్హు­ల­కు వీ­లై­నంత తొం­ద­ర­గా ఇంటి పట్టా­ల­ను అం­దిం­చేం­దు­కు అధి­కా­రు­లు కస­ర­త్తు చే­స్తు­న్నా­రు. జగ­న్‌ పా­ల­న­లో అస్త­వ్య­స్తం­గా రూ­పొం­దిం­చి లబ్ధి­దా­రు­ల­కు కే­టా­యిం­చ­కుం­డా వది­లిన లే­అ­వు­ట్ల­ల­ను గు­ర్తిం­చి కొ­త్త లబ్ధి­దా­రు­ల­కు సర్దు­బా­టు చే­య­డా­ని­కి అధిక ప్రా­ధా­న్యం ఇస్తు­న్నా­రు. ఇప్ప­టి­వ­ర­కు అం­దిన సమా­చా­రం ప్ర­కా­రం.. రా­ష్ట్ర వ్యా­ప్తం­గా 6.53 లక్షల ప్లా­ట్లు ఖా­ళీ­గా ఉన్న­ట్లు గు­ర్తిం­చా­రు. రెం­డు సం­వ­త్స­రా­ల్లో­గా ఇంటి పట్టాల పం­పి­ణీ పూ­ర్తి చేసి, ని­ర్మా­ణా­లు చే­ప­ట్టా­ల­ని సీఎం చం­ద్ర­బా­బు అధి­కా­రు­ల­ను ఆదే­శిం­చా­రు. వై­కా­పా హయాం­లో స్థ­లా­లు పొం­దిన వారు వె­న­క్కు ఇచ్చి­న­ట్ల­యి­తే.. అటు­వం­టి వా­రి­కి సదరు లే­అ­వు­ట్ల­లో­ని ఖాళీ స్థ­లా­ల్లో సర్దు­బా­టు చే­య­ను­న్నా­రు.

పట్ట­ణా­ల­లో రెం­డు సెం­ట్లు

ఎన్ని­కల సమ­యం­లో ఇచ్చిన హామీ మే­ర­కు ని­రు­పే­ద­ల­కు పట్ట­ణా­ల­లో రెం­డు సెం­ట్లు, గ్రా­మా­ల­లో మూడు సెం­ట్లు స్థ­లం ఇచ్చేం­దు­కు ప్ర­భు­త్వం సి­ద్ధ­మైం­ది. గత వై­సీ­పీ ప్ర­భు­త్వం­లో ఇళ్ల పట్టా­లు పొం­ది ఇల్లు ని­ర్మిం­చ­ని వా­రి­కి కూడా ఈ పథకం వర్తిం­ప­జే­య­ను­న్నా­రు. వై­సీ­పీ ప్ర­భు­త్వం­లో ఇళ్ల స్థ­లాల పం­పి­ణీ కోసం భూ­ము­ల­ను సే­క­రిం­చా­రు. అవ­స­ర­మై­తే ఆ భూ­ము­ల­కు అద­నం­గా భూ­మి­ని సమీ­క­రిం­చా­ల­ని ప్ర­భు­త్వం భా­వి­స్తోం­ది. ఇళ్ల స్థ­లాల కోసం దర­ఖా­స్తుల స్వీ­క­రణ మొ­ద­లు­కా­గా.. లబ్ధి­దా­రు­ల­లో ఆనం­దం వ్య­క్త­మ­వు­తోం­ది.

 ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు ఇలా..

మరో­వై­పు ప్ర­భు­త్వం మం­జూ­రు చేసే ఇళ్ల స్థ­లాల కోసం శని­వా­రం నుం­చి ఆన్‌­లై­న్‌ వి­ధా­నం­లో దర­ఖా­స్తు చే­సు­కు­నే అవ­కా­శం కల్పిం­చా­రు. అర్హు­లై ఉండి.. ఇళ్ల స్థ­లా­లు కా­వా­ల్సిన వారు తమ ఆధా­ర్ కా­ర్డు. రే­ష­న్ కా­ర్డు­ల­తో పా­టు­గా పా­స్‌­పో­ర్టు సైజు ఫో­టో­తో గ్రామ సచి­వా­ల­యా­ల­ను సం­ప్ర­దిం­చా­లి. సచి­వా­లయ సి­బ్బం­ది­కి ఇళ్ల స్థ­లాల కోసం దర­ఖా­స్తు­లు అం­ద­జే­యా­ల­ని అధి­కా­రు­లు సూ­చి­స్తు­న్నా­రు. వై­సీ­పీ ప్ర­భు­త్వ హయాం­లో పట్ట­ణా­ల­లో సెం­టు, గ్రా­మా­ల­లో సెం­టు­న్నర చొ­ప్పున ఇళ్ల స్థ­లా­లు పం­పి­ణీ చే­సిం­ది. అయి­తే చా­లా­మం­ది పట్టా­లు తీ­సు­కు­న్న­ప్ప­టి­కీ అం­దు­లో ఇళ్ల ని­ర్మా­ణా­లు జర­ప­లే­దు.

Tags:    

Similar News